అన్వేషించండి

Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో విషాదం, తాటి ముంజుల కోసం ఆగితే దూసుకొచ్చిన మృత్యువు, ముగ్గురు మృతి

Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటి ముంజుల కోసం రోడ్డు పక్కన ఆగిన బైక్ లపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు.

Vizianagaram Accident : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగిన రెండు ద్విచక్రవాహనాలను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఎస్‌.కోటకు ఉంటున్న కిల్లో సోనాపతి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై స్వగ్రామం అనంతపురంలోని కోనాపురం బయలుదేరారు. మార్గమధ్యలో గౌరీపురం దగ్గర రోడ్డు పక్కన తాటి ముంజలు కొనేందుకు బైక్ ఆపారు. అదే సమయంలో అరకు వైపు నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైకులపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో సోనాపతి, ఆయన భార్య శ్రావణి తీవ్రంగా గాయపడ్డారు. వారి పిల్లలు శ్రావణ్‌(6), సువాస్‌(3) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న బైక్ పై ఉన్న పెద్దకండేపల్లికి చెందిన అప్పారావు, అతని తమ్ముడు, కూతురు ఐదేళ్ల సుచిత కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని శృంగవరపు కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని విశాఖకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనాపతి మృతి చెందారు.  ఎస్‌.కోట ఎస్సై తారకేశ్వరరావు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో విషాదం, తాటి ముంజుల కోసం ఆగితే దూసుకొచ్చిన మృత్యువు, ముగ్గురు మృతి

లైట్ లేని బైక్ ముగ్గురి ప్రాణాలు తీసింది

రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పుకు మరొకరు బలి అవుతుంటారు. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి వేళ లైట్ లేని బైక్ తో రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నాడు. బైక్‌పై శివ, బహదూర్, ఆశిష్ అనే ముగ్గురు యువకులు పటాన్‌చెరు నుంచి పటేల్‌‌గూడెం వెళ్తున్నారు. అమీన్‌పూర్ వద్దకు వచ్చే సరికి సడన్ గా ఎదురుగా వచ్చిన బైక్ ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఆశిష్ చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా వాళ్లూ అక్కడ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనానికి లైట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అజిత్, శివ ముర్ర అనే యువకులు లైట్ లేని బైక్‌పై పటాన్‌చెరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

హన్మకొండలో రోడ్డు ప్రమాదం 

శాయంపేటలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ, ఓ ఆటో (టాటా ఏస్ వాహనం)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట శివారులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజులాగే కూలీ పని కోసం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మొగుళ్లపల్లి మండలంలో మిరప తోటలో కాయలు ఏరడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా,  మరో 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget