అన్వేషించండి

Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో విషాదం, తాటి ముంజుల కోసం ఆగితే దూసుకొచ్చిన మృత్యువు, ముగ్గురు మృతి

Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటి ముంజుల కోసం రోడ్డు పక్కన ఆగిన బైక్ లపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు.

Vizianagaram Accident : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగిన రెండు ద్విచక్రవాహనాలను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఎస్‌.కోటకు ఉంటున్న కిల్లో సోనాపతి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై స్వగ్రామం అనంతపురంలోని కోనాపురం బయలుదేరారు. మార్గమధ్యలో గౌరీపురం దగ్గర రోడ్డు పక్కన తాటి ముంజలు కొనేందుకు బైక్ ఆపారు. అదే సమయంలో అరకు వైపు నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైకులపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో సోనాపతి, ఆయన భార్య శ్రావణి తీవ్రంగా గాయపడ్డారు. వారి పిల్లలు శ్రావణ్‌(6), సువాస్‌(3) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న బైక్ పై ఉన్న పెద్దకండేపల్లికి చెందిన అప్పారావు, అతని తమ్ముడు, కూతురు ఐదేళ్ల సుచిత కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని శృంగవరపు కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని విశాఖకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనాపతి మృతి చెందారు.  ఎస్‌.కోట ఎస్సై తారకేశ్వరరావు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో విషాదం, తాటి ముంజుల కోసం ఆగితే దూసుకొచ్చిన మృత్యువు, ముగ్గురు మృతి

లైట్ లేని బైక్ ముగ్గురి ప్రాణాలు తీసింది

రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పుకు మరొకరు బలి అవుతుంటారు. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి వేళ లైట్ లేని బైక్ తో రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నాడు. బైక్‌పై శివ, బహదూర్, ఆశిష్ అనే ముగ్గురు యువకులు పటాన్‌చెరు నుంచి పటేల్‌‌గూడెం వెళ్తున్నారు. అమీన్‌పూర్ వద్దకు వచ్చే సరికి సడన్ గా ఎదురుగా వచ్చిన బైక్ ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఆశిష్ చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా వాళ్లూ అక్కడ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనానికి లైట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అజిత్, శివ ముర్ర అనే యువకులు లైట్ లేని బైక్‌పై పటాన్‌చెరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

హన్మకొండలో రోడ్డు ప్రమాదం 

శాయంపేటలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ, ఓ ఆటో (టాటా ఏస్ వాహనం)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట శివారులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజులాగే కూలీ పని కోసం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మొగుళ్లపల్లి మండలంలో మిరప తోటలో కాయలు ఏరడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా,  మరో 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengaluru: ఫ్రెండ్స్‌తో సామూహిక శృంగారానికి ఒత్తిడి - భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త - కొందరి కష్టాలంతే!
ఫ్రెండ్స్‌తో సామూహిక శృంగారానికి ఒత్తిడి - భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త - కొందరి కష్టాలంతే!
Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Chandigarh Blast: చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
 డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Embed widget