అన్వేషించండి

Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం, టపాసుల స్టాల్స్‌లో మంటలు చెలరేగి ఇద్దరు దుర్మరణం!

టపాసుల స్టాల్స్ లో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలిపోతున్నాయి. దీంతో కొన్ని స్టా్ల్స్ అగ్నికి కాలిపోతున్నాయి. విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో ఈ ప్రమాదం జరిగింది.

Fire Broke Out at Cracker Stall in Vijayawada: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ లో మంటలు చెలరేగాయి. టపాసుల స్టాల్స్ లో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలిపోతున్నాయి. దీంతో కొన్ని స్టాల్స్ అగ్నికి కాలిపోతున్నాయి. దుకాణదారులు, స్థానికులు ప్రాణ భయంతో గ్రౌండ్ బయటకు పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారని సమాచారం. మరికొందరు స్థానికుల సహాయంతో దుకాణాదారులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు జింఖానా గ్రౌండ్ కు వెళ్లి పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టాల్స్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగా విజయవాడలోనూ పటాసుల స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం గాంధీ నగర్ లోని జింఖానా మైదానంలో నిర్వాహకులు దీపావళి టపాసుల స్టాల్స్‌ ఏర్పాటు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. నేడు ఆదివారం, సెలవు దినం కావడంతో కొనుగోలుదారులు క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు జింఖానా గ్రౌండ్ కు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాసు పేలింది. దాంతో దీపావళి క్రాకర్స్ స్టాల్స్ లో ఓచోట మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పక్కనున్న స్టాల్స్ కు వ్యాపించాయి. పటాసులు భారీ శబ్ధంతో పేలుతుండటంతో దుకాణదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు దుకాణదారులు స్థానికుల సహాయంతో మంటలపై నీళ్లు చల్లుతూ అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. మొత్తం 19 షాపులకు అనుమతి ఉండగా, ఇందులో మూడు షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. 15, 16, 17 షాపుల్లో చెలరేగిన మంటలు చెలరేగి లక్షల్లో నష్టం వాటిల్లింది. మృతులు 15వ షాపుకు చెందినవారుగా భావిస్తున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక వ్యాపారికి గుండె పోటు రావటంతో ఆసుపత్రికి తరలించారు.

పండుగ పూట విషాదం..
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్రాకర్ స్టాల్ లో పటాసు పేలడంతో అది భారీ అగ్ని ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదంలో మూడుకు పైగా దీపావళి క్రాకర్స్ స్టాల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిని పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.  ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget