అన్వేషించండి

Fathima Murder case: ప్రేమ పేరుతో వల... బంగారంతో యూపీకి రమ్మని ఫోన్ కాల్స్.. విజయవాడ యువతి హత్య కేసులో కీలక ఆధారాలు

విజయవాడ యువతి ఫాతిమా మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు రాబట్టారు. ఫాతిమాను ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యచేసినట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి, విజయవాడ తీసుకువచ్చారు.

సంచలనం రేపిన ఫాతిమా అనే విజయవాడ యువతి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు వాసిమ్‌, తయ్యబ్‌లను ఇవాళ విజయవాడకు తీసుకువచ్చారు. జులై 10వ తేదీన విజయవాడలోని తన ఇంటి నుంచి వెళ్లిన ఫాతిమా కనిపించకుండా పోయింది. ఫాతిమా ఆచూకీ కోసం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఫాతిమాను ఉత్తరప్రదేశ్‌కు రప్పించుకున్న నిందితులు ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫాతిమాను వీరిద్దరే హత్య చేశారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుపై పూర్తి విచారణకు నిందితులను విజయవాడ తీసుకువచ్చారు. 

వైద్యం పేరుతో వంచన

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని, నయం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించింది విజయవాడకు చెందిన ఓ కుటుంబం. వాళ్లే ఆ యువతి పాలిట రాక్షసులుగా మారారు. ప్రేమ పేరుతో నయవంచన చేసి చివరకు ఆ యువతిని హత్య చేశారు. విజయవాడ వన్ టౌన్ కు చెందిన నజీర్ అహ్మద్‌కు ఐదుగురు ఆడపిల్లలు. తన రెండో కుమార్తె ఫాతిమా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో ‌ఉత్తరప్రదేశ్‌లో భూతవైద్యలను ఆశ్రయించారు. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన భూతవైద్యలు 10 రోజులు ఉండి ఫాతిమాకు అతీత శక్తులు ఆవహించాయని నమ్మబలికారు. చివరకు ఏవో పూజలు చేసి దుష్టశక్తులను వదిలించామన్నారు. 

బంగారం తీసుకొని హత్య

ఈ పరిచయంతో ఉత్తరప్రదేశ్ నుండి ప్రతిరోజు ఫాతిమాకు ఫోన్ చేసి ఆ భూతవైద్యులు మాట్లాడుతుండేవారు. వారి మాయ మాటలు నమ్మి గత నెల 9వ తేదీన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఫాతిమా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన వెంట తీసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారిని విచారించినా ఫలితం లేకపోయింది. చివరకు విజయవాడలోని కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ కేసు దర్యాప్తుపై ఉత్తరప్రదేశ్ వెళ్లిన పోలీసులకు భూతవైద్యం చేసిన వాసిఫ్, తయ్యబ్ కనిపించారు. స్థానిక పోలీసుల సాయంతో తమదైన శైలిలో విచారించగా, 15 సవార్ల బంగారం తీసుకుని ఫాతిమాను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్ సహరంపూర్ నుంచి ఇద్దరు నిందితులను స్థానిక కోర్టు అనుమతితో విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. 

Also Read: Medak Car Fire: అటవీ ప్రాంతంలో తగలబడిన కారు... డిక్కీలో చూస్తే రియల్టర్ డెడ్‌బాడీ... మెదక్‌లో ఆందోళన కలిగించిన సంఘటన

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget