అన్వేషించండి

Vijayawada Crime : ఒంటరి మహిళలే టార్గెట్, పెళ్లి చేసుకుని నగలతో జంప్!

Vijayawada Crime : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

Vijayawada Crime : భర్తతో విడిపోయిన మహిళలను టార్గెట్ గా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న మోసగాడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకు చెందిన నిందితుడు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు మహిళలను మోసగించినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. 

 పెళ్లి పేరుతో మోసం

మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసి వారి వద్ద నుంచి డబ్బు, నగలను తీసుకుని పరారవుతున్న అంతర్ రాష్ట్ర మోసగాడు గట్టమనేని మనోహర్ అలియాస్ మనోహరన్ ను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ నగరానికి చెందిన వివాహితను రెండో పెళ్లి పేరుతో వివాహం చేసుకొని ఆమె నుంచి బంగారం, నగదు దోచుకొని పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మనోహర్ ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలను మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

బస్సులో మాటలు కలిపి వివాహం వరకు 

విజయవాడకు చెందిన మహిళ  20 సంవత్సరాల క్రితం తన భర్తతో విబేధాల కారణంగా విడిపోయి కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. తన కుమారుడు కోసం హైదరాబాద్ వెళుతున్న సమయంలో బస్సులో మనోహరన్ పరిచయం అయ్యాడు. తనకు వివాహం అయ్యిందని అయితే విడాకులు తీసుకున్నానని, రెండో పెళ్లి కోసం ఒక వెబ్ సైట్ ద్వారా ప్రకటన ఇచ్చినట్లుగా వివరాలను చూపించారు. అయితే అదే వెబ్ సైట్ లో సదరు మహిళ కూడా రెండో వివాహానికి దరఖాస్తు చేసుకుంది. దీంతో మనోహరన్ సదరు మహిళతో ఈజీగా మాటలు కలిపాడు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన  మంగళగిరిలోని దేవాలయంలో ఇరువురు వివాహం చేసుకున్నారు. మహిళకు చెందిన సొంత ఫ్లాట్ లోనే  నివాసం ఉంటున్నారు. 

మహిళ కుటుంబ సభ్యులను కూడా మోసం చేసి 

 మనోహర్ తన వ్యాపార నిమిత్తం మహిళ నుంచి పలు దఫాలుగా సుమారు రూ.5 లక్షలు తీసుకున్నాడు. అంతే కాదు  ఆమె తమ్ముడు వద్ద నుంచి 2.5 లక్షలు తీసుకున్నాడు. అంతే కాదు మహిళ పేరు మీద పలు క్రెడిట్ కార్డులను తీసుకుని వాడుకున్నాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి, వెళ్లిన మనోహరన్  ఎన్ని రోజులు అయిన  తిరిగి రాకపోవడంతో అతని సొంత గ్రామం చిత్తూరు జిల్లా కావేరి రాజపురానికి వెళ్లి బాధిత మహిళ విచారించింది. అయితే మనోహరన్ తల్లి చనిపోలేదని, అతనికి మరొక వివాహం జరిగినట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయానని గ్రహించి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడైన మనోహర్ తిరుపతి, గుంటూరు,  హైదరాబాద్ ఏరియాలో తిరుగుతున్నాడని గుర్తించారు. ప్రత్యేక బృందాలకు వచ్చిన సమాచారం మేరకు  హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద మనోహర్ ను  అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో నిందితుడైన గట్టమనేని మనోహర్  ఇతని స్వగ్రామం తమిళనాడు, ఇంటర్ వరకు చదువుకుని తరువాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడని పోలీసులు తెలిపారు.  జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ద్వారా ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని తన మాటలతో ఏమార్చి  డబ్బులను తీసుకుని జల్సాలు చేస్తూ మోసాలకుపాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

 వెబ్ సైట్ ద్వారానే

 రాజముండ్రికి చెందిన మహిళను తన మాయమాటలతో ఏమార్చి పెళ్లి చేసుకుని ఆమె వద్ద నుంచి డబ్బులను బంగారపు వస్తువులను తీసుకుని మోసగించాడు. విశాఖపట్నంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని మోసం చేసి పారిపోయాడు. అదే విధంగా  హైదరాబాద్, చెన్నై, తిరుపతి లలో అమాయక ప్రజలను పలురకాలుగా మోసాలు చేస్తున్నాడు. అదే విధంగా విజయవాడకు చెంది వివరాలను వెబ్ సైట్ ద్వారా సేకరించి వారిని నమ్మించి పెళ్లి చేసుకుని వారి వద్ద డబ్బులను తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget