Bezawada Murders: మద్యం మత్తులో ఒకరినొకరు పొడిచి చంపేసుకున్నారు - విజయవాడలో ఇద్దరు యువకుల పరస్పర హత్య
Bezawada Crime: బెజవాడలో ఇద్దరు యువకులు పరస్పరం హత్య చేసుకున్నారు. మొదట ఇద్దర్నీ వేరే వ్యక్తి చంపారని అనుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం బయట పడింది.

Two youths killed each other in Vijayawada: హత్యలు జరుగుతాయి. చంపేసినోడు పారిపోతాడు.కానీ విజయడవాలో మాత్రం ఇద్దరు తాగుబోతులు.. మద్యం మత్తులో తామేమి చేసుకుంటున్నారో కూడా తెలియనంతగా తాగేసి కత్తులతో పొడుచుకున్నారు. ఇద్దరూ చనిపోయారు. విజయవడాలోని గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద బుధవారం ఈ డబుల్ మర్డర్స్ జరిగాయి. అక్కడికి సమీపంలో ఓ గదిలో నివాసం ఉంటున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ ఒక గదిలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. రక్తపు మడుగులో మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.
మొదట ఈ ఇద్దర్ని వేరే వ్యక్తి చంపాడని అనుకున్నారు. రౌడీ షీటర్ కిషోర్ మద్యం, గంజాయి మత్తులో ఈ హత్యలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసుల విచారణలో ఇద్దరు యువకుల మధ్య పరస్పర దాడిగా భావిస్తున్నారు. మృతదేహాలను విజయవాడ జనరల్ హాస్పిటల్ (GGH ) మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. చనిపోయిన వారు ఎవరు అన్నదానిపై పోలీసులు ఇంకాఎలాంటి వివరాలు వెల్లడించలేదు. వారు గంజాయి బ్యాచ్ సభ్యులని అనుమానిస్తున్నారు.



















