అన్వేషించండి

Tirumala News : గుజరాత్ భక్తులను నిలువునా ముంచిన దళారులు, 540 నకిలీ టికెట్లతో రూ.6.8 లక్షల స్వాహా

Tirumala News : తిరుపతిలోని ఓ లాడ్జీ నిర్వాహకులు గుజరాత్ భక్తులను నిలువునా ముంచారు. 540 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేస్తామని‌ 6.8 లక్షలు వసూలు చేశారు.

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అమాయక భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువు దోపిడి చేస్తున్నారు కొందరు దళారులు. టోకెన్లు లేని భక్తులను మాయమాటలు చెప్పి అధిక మొత్తంలో వారి వద్ద నుంచి నగదు వసూలు చేయడంతో పాటుగా నట్టేట ముంచుతున్నారు. తాజాగా గుజరాత్ నుంచి వచ్చిన ఓ భక్త బృందం నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి వారికి నకిలీ దర్శన టోకెన్లు అంటగట్టారు. దర్శన టోకెన్లను ప్రింట్ తీసుకునే సమయంలో జిరాక్స్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో విషయం తెలుసుకున్న భక్తులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి నగదును తిరిగి బాధితులకు అప్పగించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

540 భక్తుల నుంచి రూ.6.8 లక్షలు స్వాహా

మూడు రోజుల క్రితం గుజరాత్ కు చెందిన 540 మంది భక్త బృందం వివిధ ఆలయాలను సందర్శిస్తూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుపతిలో తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ వ్యక్తి టూరిజంకు చెందిన మరోక వ్యక్తిని వారికి ఫోన్ ద్వారా పరిచయం చేయించారు. అయితే తమకు తెలిసిన లాడ్జ్ యజమాని ఉన్నారని, అతని ద్వారా దర్శనాలు చేయిస్తామని టూరిజానికి చెందిన వ్యక్తి భక్త బృందానాన్ని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన భక్తులు తిరుపతిలోని ఓ‌ లాడ్జ్ యజమానికి దాదాపు 6.8 లక్షల రూపాయలు ఫోన్ ఫే, గూగుల్ ఫే ద్వారా నగదును జమచేశారు. అయితే భక్త బృందం నగదు జమ చేసిన మరుసటి రోజు టూరిజం, లాడ్జ్ యజమాని ఫోన్ చేసి దర్శన టోకెన్లు‌ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ మాటలు నమ్మిన భక్తులు  నేరుగా తిరుపతికి చేరుకుని టూరిజం శాఖకు చెందిన ఉద్యోగితో పాటు లాడ్జ్ యజమాని వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే తాము ముందస్తుగా ప్లాన్ చేసిన నకిలీ టోకెన్లను డాక్యుమెంట్ రూపంలో ఫోన్ లో సిద్ధం చేసి వారికి పంపించారు. వాటిని జిరాక్స్ తీసుకుని‌ తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు. 

నకిలీ టికెట్లను గుర్తించిన జిరాక్స్ షాపు యజమాని 

అది నమ్మిన భక్త బృందం జిరాక్స్ కోసం షాపునకు వెళ్లగా ఆ టికెట్లను చూడగానే ఇవి నకిలో టోకెన్లని జిరాక్స్ షాపు యజమాని చెప్పడంతో తేరుకున్న భక్తులు  తిరుపతిలోని టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించారు. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నమ్మిపోసిన గుజరాతీయులకు న్యాయం చేసేందుకు వివరాలు తీసుకుని టూరిజం, లాడ్జ్ యజమాని అదుపులోకి తీసుకుని నగదుని భక్త బృందానికి తిరిగి అప్పగించారు. అయితే భక్త బృందాన్ని మోసగించిన టూరిజం శాఖ ఉద్యోగి, లాడ్జ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget