అన్వేషించండి

Tirumala News : గుజరాత్ భక్తులను నిలువునా ముంచిన దళారులు, 540 నకిలీ టికెట్లతో రూ.6.8 లక్షల స్వాహా

Tirumala News : తిరుపతిలోని ఓ లాడ్జీ నిర్వాహకులు గుజరాత్ భక్తులను నిలువునా ముంచారు. 540 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేస్తామని‌ 6.8 లక్షలు వసూలు చేశారు.

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అమాయక భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువు దోపిడి చేస్తున్నారు కొందరు దళారులు. టోకెన్లు లేని భక్తులను మాయమాటలు చెప్పి అధిక మొత్తంలో వారి వద్ద నుంచి నగదు వసూలు చేయడంతో పాటుగా నట్టేట ముంచుతున్నారు. తాజాగా గుజరాత్ నుంచి వచ్చిన ఓ భక్త బృందం నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి వారికి నకిలీ దర్శన టోకెన్లు అంటగట్టారు. దర్శన టోకెన్లను ప్రింట్ తీసుకునే సమయంలో జిరాక్స్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో విషయం తెలుసుకున్న భక్తులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి నగదును తిరిగి బాధితులకు అప్పగించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

540 భక్తుల నుంచి రూ.6.8 లక్షలు స్వాహా

మూడు రోజుల క్రితం గుజరాత్ కు చెందిన 540 మంది భక్త బృందం వివిధ ఆలయాలను సందర్శిస్తూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుపతిలో తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ వ్యక్తి టూరిజంకు చెందిన మరోక వ్యక్తిని వారికి ఫోన్ ద్వారా పరిచయం చేయించారు. అయితే తమకు తెలిసిన లాడ్జ్ యజమాని ఉన్నారని, అతని ద్వారా దర్శనాలు చేయిస్తామని టూరిజానికి చెందిన వ్యక్తి భక్త బృందానాన్ని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన భక్తులు తిరుపతిలోని ఓ‌ లాడ్జ్ యజమానికి దాదాపు 6.8 లక్షల రూపాయలు ఫోన్ ఫే, గూగుల్ ఫే ద్వారా నగదును జమచేశారు. అయితే భక్త బృందం నగదు జమ చేసిన మరుసటి రోజు టూరిజం, లాడ్జ్ యజమాని ఫోన్ చేసి దర్శన టోకెన్లు‌ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ మాటలు నమ్మిన భక్తులు  నేరుగా తిరుపతికి చేరుకుని టూరిజం శాఖకు చెందిన ఉద్యోగితో పాటు లాడ్జ్ యజమాని వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే తాము ముందస్తుగా ప్లాన్ చేసిన నకిలీ టోకెన్లను డాక్యుమెంట్ రూపంలో ఫోన్ లో సిద్ధం చేసి వారికి పంపించారు. వాటిని జిరాక్స్ తీసుకుని‌ తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు. 

నకిలీ టికెట్లను గుర్తించిన జిరాక్స్ షాపు యజమాని 

అది నమ్మిన భక్త బృందం జిరాక్స్ కోసం షాపునకు వెళ్లగా ఆ టికెట్లను చూడగానే ఇవి నకిలో టోకెన్లని జిరాక్స్ షాపు యజమాని చెప్పడంతో తేరుకున్న భక్తులు  తిరుపతిలోని టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించారు. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నమ్మిపోసిన గుజరాతీయులకు న్యాయం చేసేందుకు వివరాలు తీసుకుని టూరిజం, లాడ్జ్ యజమాని అదుపులోకి తీసుకుని నగదుని భక్త బృందానికి తిరిగి అప్పగించారు. అయితే భక్త బృందాన్ని మోసగించిన టూరిజం శాఖ ఉద్యోగి, లాడ్జ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget