అన్వేషించండి

Viral Crime: భార్యను చంపాడు - కోర్టులో శిక్ష వేసే ముందే కన్నుమూశాడు - భర్తను దేవుడే శిక్షించాడా ?

Dies in court: అమెరికాలో భార్యను చంపిన నేరానికి కోర్టు ఓ భర్తకు 35 ఏళ్ల శిక్ష విధించింది. అయితే తీర్పును ప్రకటించక ముందే ఆ నిందితుడు కోర్టులోనే చనిపోయాడు.

Teacher dies in court before sentenced prison for killing wife: అక్కడ కోర్టులో జడ్జి తన తీర్పును చదువుతున్నారు. నిందితుడు చేసిన నేరం నిరూపితమయింది. ఆయనకు శిక్ష విధించబోతున్నారు. కానీ అప్పుడే నిందితుడు ఆ అవసరం లేకుండా కన్ను మూశాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేకపోతే సహజంగా చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది.            

అమెరికాలోని టెక్సాస్‌లోని హ్యూస్టన్ కోర్టులో ఒక మాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, భార్యను హత్య చేసినందుకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించబోయే ముందు మరణించాడు. జేమ్స్ పాల్ ఆండర్సన్ (39) అనే ఈ వ్యక్తి, 2023లో తన 34 ఏళ్ల భార్య విక్టోరియా ఆండర్సన్‌ను  కాల్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. అతనిపై నేరాభియోగాలు మోపారు. విచారణలో నేరం నిరూపితమయింది. కానీ శిక్ష విధించే సమయంలో కోర్టులోనే చనిపోయాడు.  

జేమ్స్ ఆండర్సన్, క్లీవ్‌ల్యాండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసేశాడు. 2023 సెప్టెంబర్‌లో, అతను తన భార్య విక్టోరియాను గొడవలో  హత్య చేశాడు. ఈ ఘటన సమయంలో, విక్టోరియా 911కు కాల్ చేసి సహాయం కోరింది, కానీ కాల్ మధ్యలోనే కాల్పుల శబ్దాలు వినిపించాయి.  పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత జేమ్స్ లొంగిపోయాడు. జేమ్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొన్నాల్లకు  300,000 లక్షల డాలర్ల బాండ్ సమర్పించి బయటకు వచ్చాడు.  నేరం నిరూపితం కావడంతో అతను హ్యూస్టన్ క్రిమినల్ జస్టిస్ సెంటర్‌లోని 208వ జిల్లా కోర్టులో 35 ఏళ్ల జైలు శిక్షకు ఒప్పుకునే ప్లీ డీల్‌ను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. అయితే, కోర్టు ప్రారంభమవుతున్న సమయంలో, అతను అకస్మాత్తుగా  కుప్పకూలిపోయాడు.                                    

హ్యారిస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీస్ ఆఫీస్ ప్రకారం, జేమ్స్ కోర్టులోకి వచ్చిన తర్వాత కొన్ని నిమిషాలలోనే అతను మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్నాడు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ  ఆరోగ్యం మరింత విషమించింది. హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అతన్ని బెన్ టాబ్ హాస్పిటల్‌కు తరలించింది. అక్కడ అతను మరణించాడు.                         

ఈ పరిణామం కారణంగా, జడ్జి కోర్టు గదిని క్లియర్ చేసి, దానిని సాధ్యమైన క్రైమ్ సీన్‌గా ప్రకటించారు. సాక్షుల ప్రకారం, జేమ్స్ తన న్యాయవాదితో మాట్లాడిన తర్వాత, కొన్ని నిమిషాలు ఒంటరిగా ఉండాలని కోరాడు. ఆ సమయంలో అతను ఏదో తినడం వల్ల వాంతులు చేసుకున్నట్లుగా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేకపోతే సహజంగానే చనిపోయాడా అన్నదాన్ని వైద్యులు తేల్చనున్నారు. 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget