అన్వేషించండి

Punganur: పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన - టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత

Andhrapradesh News: చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడితో గురువారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వైసీపీ ఎంపీ మిథున్ వెళ్లిన క్రమంలో ఘర్షణ జరిగింది.

Tension Situation In Punganur: చిత్తూరులో జిల్లా పుంగనూరులో (Punganuru) గురువారం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. టీడీపీ కార్యకర్తలు 'మిథున్ రెడ్డి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎంపీని గృహ నిర్బంధం చేశారు. కాగా, ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ పుంగనూరులో అప్పుడప్పుడూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

గాల్లోకి కాల్పులు

పోలీసులు చెదరగొట్టడంతో కొద్దిసేపు శాంతించినా.. అనంతరం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండడంతో టీడీపీ శ్రేణులు ఆ ఇంటిపై దాడికి దిగాయి. వాహనం ధ్వంసం కాగా.. మిథున్ రెడ్డి గన్ మెన్లు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ దాడుల్లో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని పేర్కొన్నాయి. పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

దాడిని ఖండించిన ఎంపీ

అటు, టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిదున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందని నిలదీశారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు.

అటు, పల్నాడు జిల్లా వినుకొండలోనూ వైసీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే మరో వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వదిలేయమని ప్రాథేయపడినా నిందితుడు కనికరించలేదు. రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని నిర్ధారించారు.

Also Read: YS Jagan Tweet: 'ఏపీలో రాక్షస పాలన సాగుతోంది' - వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన జగన్, సీఎం చంద్రబాబుకు వార్నింగ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget