అన్వేషించండి

Punganur: పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన - టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత

Andhrapradesh News: చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడితో గురువారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వైసీపీ ఎంపీ మిథున్ వెళ్లిన క్రమంలో ఘర్షణ జరిగింది.

Tension Situation In Punganur: చిత్తూరులో జిల్లా పుంగనూరులో (Punganuru) గురువారం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి. టీడీపీ కార్యకర్తలు 'మిథున్ రెడ్డి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎంపీని గృహ నిర్బంధం చేశారు. కాగా, ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ పుంగనూరులో అప్పుడప్పుడూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

గాల్లోకి కాల్పులు

పోలీసులు చెదరగొట్టడంతో కొద్దిసేపు శాంతించినా.. అనంతరం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండడంతో టీడీపీ శ్రేణులు ఆ ఇంటిపై దాడికి దిగాయి. వాహనం ధ్వంసం కాగా.. మిథున్ రెడ్డి గన్ మెన్లు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ దాడుల్లో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని పేర్కొన్నాయి. పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

దాడిని ఖండించిన ఎంపీ

అటు, టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిదున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందని నిలదీశారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు.

అటు, పల్నాడు జిల్లా వినుకొండలోనూ వైసీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనే మరో వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వదిలేయమని ప్రాథేయపడినా నిందితుడు కనికరించలేదు. రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని నిర్ధారించారు.

Also Read: YS Jagan Tweet: 'ఏపీలో రాక్షస పాలన సాగుతోంది' - వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన జగన్, సీఎం చంద్రబాబుకు వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
Embed widget