By: ABP Desam | Published : 21 Sep 2021 08:45 PM (IST)|Updated : 21 Sep 2021 08:46 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తీవ్ర కడుపు నొప్పితో గర్భిణి మృతి
వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి ప్రాణం తీసింది. ప్రసవం చేసే సమయంలో మహిళ కడుపులో వైద్యులు దూది మరచిపోవడంతో ఆమె మృతి చెందింది. ఏడాది క్రితం రాయగిరికి చెందిన మహిళకు యాదాద్రి భువనగిరిలోని కె.కె. ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. ఆ తర్వాత నుంచి మహిళ కడపునొప్పితో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో మహిళ కడుపులో వైద్యులు దూదిని గుర్తించారు. తొలి కాన్పు సమయంలో కడుపులో వైద్యులు దూది మరిచిపోయినట్లు తేలింది. కాగా చికిత్స పొందుతూ ఆరు నెలల గర్భిణి ఇవాళ మృతి చెందింది. మహిళ కడుపులో దూది కారణంగా పేగులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో గర్భిణీకి తొలి కాన్పు చేసిన ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: Kakinada: కాకినాడలో వైద్య విద్యార్థిని హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కారణం
కడుపులో దూది
వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలు తీసింది. ఏడాది పాపను అనాథ చేసి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు కోసం ఏడాది క్రితం భువనగిరి కేకే ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు సర్జరీ నిర్వహించి డెలివరీ చేశారు. ప్రసవం మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. కడుపునొప్పి ఇంకా తీవ్రం అవ్వడంతో ఇటీవలే చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల మెడికల్ టెస్టులు చేయగా కడుపులో దూది ఉన్నట్లు తెలిసింది.
Also Read: Hyderabad: మీకు పని మనిషి ఉన్నారా? తస్మాత్ జాగ్రత్త! మీకూ ఇలా జరగొచ్చు.. ఇదో కొత్త రకం మోసం
బంధువుల ఆందోళన
తొలికాన్పు సమయంలో ఆమె కడుపులో దూది మరిచిపోయి కుట్లు వేశారు. ఆ దూది అలాగే ఉండటంతో పేగులు దెబ్బతిని తీవ్రమైన కడుపునొప్పికి కారణమైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమెకు తొలి కాన్పు చేసిన భువనగిరి కేకే ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు చేశారు. మహిళ మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ధర్నాకు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Vemulawada Kid Kidnap Case: గంటల వ్యవధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన వేములవాడ పోలీసులు, క్షేమంగా తల్లీ ఒడికి బాలుడు
Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !
Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
Vijayawada Drugs : బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?
Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న