అన్వేషించండి

T Subbarami Reddy: సుబ్బరామిరెడ్డి కంపెనీకి భారీ టోకరా.. నిందితులు అరెస్టు, అసలేం జరిగిందంటే..

గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యాపార విస్తరణ కోసం రుణం కోసం యత్నాలు చేస్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న నిందితులు ఇందిరా రెడ్డిని సంప్రదించారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బరామి రెడ్డికి చెందిన కంపెనీకి పలువురు టోకరా వేశారు. బ్యాంకులు కాని వేరే ఆర్థిక దిగ్గజ కంపెనీల నుంచి రుణం ఇప్పిస్తామంటూ మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన నిర్మాణ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ను నిందితులు మోసం చేశారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌ పోలీసులు నిందితులు హర్ష వర్ధన్‌, బాలూభాయ్‌ పటేల్‌‌ను ముంబయిలో అరెస్టు చేశారు. వీరిద్దరూ తమకు అప్పు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకు షేర్లను కూడా తనఖా ఉంచుకున్నారని.. వాటిని అమ్మి రూ.105 కోట్లు కాజేశారని సుబ్బరామి రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి గత జులైలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. 

అయితే, ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో షేర్ల పత్రాలను వారు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితులు ముంబయిలో ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల కిందటే వారిని అరెస్టు చేయగా.. సోమవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చి జైలుకు తరలించారు. సుబ్బరామి రెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ సోమాజీగూడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది.

32.50 లక్షల షేర్ల తనఖా
గాయత్రి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యాపార విస్తరణ కోసం రుణం కోసం యత్నాలు చేస్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న నిందితులు ఇందిరా రెడ్డిని సంప్రదించారు. గత ఏడాది జూన్‌ నెలలో ఛాంపియన్‌ ఫిన్‌ సెక్‌ (సీఎఫ్‌ఎల్‌) అనే కంపెనీ ప్రతినిధులు ప్రతినిధులు హర్షవర్ధన్‌, బాలూ భాయ్‌ పటేల్‌లు ఇందిరా రెడ్డిని కలిశారు. రుణాలను బ్యాకింగేతర సంస్థల నుంచి రూ.11.50 కోట్ల రుణం ఇప్పిస్తామని చెప్పారు. రుణం మంజూరయ్యాక తమకు ఒక శాతం కమీషన్‌ ఇవ్వాలని కోరారు. అయితే, అంత మొత్తం రుణానికి గానూ పూచీకత్తుగా నిర్మాణ సంస్థ షేర్లు తనఖా పెట్టాలని కోరారు. అయితే, అందుకు అంగీకరించిన ఇందిరా రెడ్డి దాదాపు 32.50లక్షల షేర్లను సీఎఫ్‌ఎల్‌ పేరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. 

Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు

చాలా రోజులైనా రుణం అందకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎఫ్‌ఎల్‌ కార్యాలయానికి ఇందిరా రెడ్డి వెళ్లారు. వెళ్లి చూడగా.. అక్కడ హర్షవర్ధన్‌, బాలూ భాయ్‌లు ఇద్దరూ లేరు. గాయత్రి ప్రాజెక్ట్స్‌ ప్రతినిధులకు అనుమానం వచ్చి సరిచూసుకోగా.. జులై 8న షేర్‌ మార్కెట్‌లో 32.50లక్షల షేర్లను నిందితులు అమ్ముకున్నట్లుగా గుర్తించారు. అయితే, ఆ రోజున షేర్ల విలువ రూ.105 కోట్లుగా ఉందని బాధితులు పోలీసులకు వివరించారు. మహారాష్ట్రలోని థానెకు చెందిన బాలూభాయ్‌ పటేల్‌ కొన్నేళ్ల కిందట ఛాంపియన్‌ ఫిన్‌సెక్‌ పేరుతో సంస్థను స్థాపించాడని, హైదరాబాద్‌, ముంబయిలోనూ కార్యాలయాలున్నాయని పోలీసులు విచారణలో భాగంగా గుర్తించారు.

Also Read: కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భేటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?

Also Read : నెల్లూరులో వైసీపీ మైండ్ గేమ్.. నిరసనలతో టీడీపీ, సిగ్గు.. ఎగ్గు.. బుద్ధి లేదంటూ ఫైర్

Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం
Embed widget