అన్వేషించండి

Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌ను వదలని వానలు- 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌- తుపాను నష్ట అంచనాలు ప్రారంభం

Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో జోరు వానలు కంటిన్యూ అవుతున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మొథా తుపాను ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించిన అల్లకల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తుపాను వాయుగుండంగా మారి తెలంగాణ వైపు వెళ్లిపోయినా వర్షాల ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. అందుకే అప్రమత్తమైన అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఫ్లాష్‌ఫ్లడ్‌కు అవకాశం ఉందని అంటున్నారు. 

శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, మచిలీపట్నం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇంకా 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని అంటున్నారు. జోరు వానలు, అకస్మాత్తుగా కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. రిస్క్ తీసుకోవద్దని అధికారులు చెబుతున్నారు. అవసరం అయితే కానీ ఎవరూ బయటకు రావద్దని హితవు పలుకుతున్నారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర ప్రభావం ఇవాళ రేపు ఉంటుందని తర్వాత నార్మల్ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. 

భారీ వర్షాలకు ఇప్పటికే పలు నదులు, వాగులు వంకలు పొంగుతున్నాయి. దీని కారణంగా రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. పులిచింతల రిజర్వాయర్ కు వరద ఇన్ ఫ్లో 5లక్షల వరుకు చేరే అవకాశం ఉన్నందున ముందుగానే దిగువకు 4.9లక్షల క్యూసెక్కులు నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని వలన ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తారు. లోతట్టు ప్రాంత లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. 

ఇప్పటికే తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంకా చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. చెరువులు వాగులు పొంగుతున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే వంద కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిగతా జిల్లాల్లో కూడా తుపాను అంచనాలు వేయడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. వర్షాలు లేని వరద ముంపు ఎక్కువగా లేని ప్రాంతాల్లో అంచనాలు షురూ చేశారు. వాన గండం పొంచి ఉండటంతో ఇంకా సహాయక శిబిరాలను కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ  ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అధికారులు చేస్తున్నారు.   

తుపాను తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2వేలకుపైగా శిబిరాలను ఏర్పాటు చేసింది. దాదాపు రెండు లక్షల మందిని అక్కడకు చేర్చింది. వారికి ఆహారం, పాతిక కేజీల బియ్యం, మూడు వేలరూపాయల నగదు, నిత్యావసర సరకులు ఇచ్చారు. వారం రోజులుగా వేటకు వెళ్లని కుటుంబాలకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు, నగదు కూడా అందజేయనున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లేకుంటే భారీ ప్రాణ నష్టాన్ని చూడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Advertisement

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget