అన్వేషించండి

Nellore: నెల్లూరులో వైసీపీ మైండ్ గేమ్.. నిరసనలతో టీడీపీ, సిగ్గు.. ఎగ్గు.. బుద్ధి లేదంటూ ఫైర్

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. అందులో 7, 8, 12, 20, 24, 37, 38, 40 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు టైమ్ దగ్గర పడే కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గొడవలు ముదురుతున్నాయి. ఏకంగా 8 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. అందులో 7, 8, 12, 20, 24, 37, 38, 40 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులే నేరుగా వైసీపీ నేతల వద్దకు వెళ్లి ఆ పార్టీ కండువా కప్పుకోవడం విశేషం.

ఏకగ్రీవాలతో టీడీపీకి షాక్.. 
ఏకంగా టీడీపీ అభ్యర్థులే నేరుగా వైరి వర్గంతో చేతులు కలపడంతో పార్టీకి పెద్ద షాక్ తగిలింది. దీంతో తమ అభ్యర్థుల్ని బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారంటూ టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. ఏకగ్రీవాల విషయంలో అధికారులు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప సహా.. స్థానిక నేతలు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.

Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు 

మా అభ్యర్థుల్ని భయపెట్టారు.. 
అటు జనసేన కూడా అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ అభ్యర్థుల్ని వైసీపీ నేతలు బెదిరించి వారివైపు తిప్పుకున్నారని అన్నారు జనసేన నేతలు. వైసీపీ ఆగడాలపై తాము పోరాటం చేస్తామని, చివరి వరకూ నిలబడతామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.

నెల్లూరులో సగం పని పూర్తి.. 
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇప్పటికే  సగం పని పూర్తి చేసింది. 8 డివిజన్లు ఏకగ్రీవం కాగా.. దాదాపు మరో 40 డివిజన్లలో నామమాత్రపు పోటీ ఉండేట్లు జాగ్రత్త పడింది. కీలక అభ్యర్థులను తెలివిగా పక్కకు తప్పించింది. టీడీపీ, జనసేన తరపున డమ్మీ అభ్యర్థులే చాలా ప్రాంతాల్లో బరిలో ఉండేట్టు వ్యూహ రచన చేసింది. నామినేషన్ల పరిశీలనలోనే కీలక అభ్యర్థులు తొలగిపోవడంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకలా మారింది.

Also Read: ఈ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో స్థిరంగా.. నేటి ధరలు ఇవీ..

నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారులు వైసీపీకి వంత పాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చదువులేని సన్నాసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిగ్గూ ఎగ్గు లేకుండా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గంటలు గడుస్తున్నా కూడా ఫైనల్ లిస్ట్ ఇవ్వడంలేదని మండిపడ్డారాయన. మంత్రి చిల్లర పనులు చేస్తున్నారని, ఆయనకి దమ్ముంటే సక్రమంగా పోటీలో నిలవాలని డిమాండ్ చేశారు.

సోమిరెడ్డి విమర్శలు
ప్రభుత్వం బరితెగించిందని, అధికారులు కూడా బరితెగించారని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరులో తమ హయాంలో 4వేల కోట్లతో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధి ఇప్పుడు ఆగిపోయిందని, దాని ఫలితం కార్పొరేషన్ ఎన్నికల్లో బయటపడుతుందని భయపడి ఏకగ్రీవాలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటూ అధికారులు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

Also Read: స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. నేడు ధరలు ఇలా..

Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget