News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న మహిళ గురువారం సాయంత్రం నాలాలో పడి మృతి చెందింది.

FOLLOW US: 
Share:

జిహెచ్ఎంసి లో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న మహిళా గురువారం సాయంత్రం సికింద్రాబాద్ లోని మెట్టుగూడ బావి వద్ద నాలాలో పడి మృతి చెందింది. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నంలో మహిళ ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది.

నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో కొట్టుకుపోయి అంబర్ నగర్ వద్ద విగతజీవిగా తేలింది. నాలాలో పడిన వెంటనే ఆమెను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో కాపాడలేకపోయారు.  ఘటన స్థలానికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 50 సంవత్సరాల వయసు గల ఓ మహిళ కమాన్ లోపల నుంచి రోడ్డు దాటుతుంది. కురిసిన వాసానికి పక్కనే ఉన్న నాలా ఉద్ధృతంగా పెరగడంతో పక్కన ఉన్న స్థానిక ప్రజలు హెచ్చరించిన ఆగకుండా ఆ మహిళ కామన్ దాటడానికి ప్రయత్నించి కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు స్థానిక కార్పొరేటర్ సునీత దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించిన కార్పొరేటర్ డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు. నాలా వెంబడి వెతికిన బౌద్ధ నగర్ డివిజన్ పరిధిలో అంబర్ నగర్ నాలా వద్ద మహిళ మృతదేహం దొరికింది. మహిళా శరీరం ఉబ్బిపోవడంతో ఎవరైనాది ఇంకా గుర్తించలేకపోయారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

హైదరాబాద్‌లో భారీ వర్షం 

అయితే మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షం కారణంగా గణేశ్ శోభాయాత్రను వీక్షించడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే భారీ వర్షంలోనూ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 

ఇకపోతే.. తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై వుంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. నిర్మిల్, కామారెడ్డి, భద్రాద్రి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.  

ఇదిలా ఉంటే నిమజ్జనం జరుగుతున్న హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. పెద్ద వర్షం కురిసినా గణేశ్ శోభాయాత్రకు ఎలాంటి అంతరాయం కలగలేదు. భక్తులు అంత వర్షంలోనూ డ్యాన్సులు చేస్తూ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. 10 రోజుల పాటు పూజలందుకున్న లంబోదరున్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద వానలోనే నిమజ్జనం కొనసాగుతోంది. ఇక ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ఇప్పటికే ముగిసింది.

Published at : 29 Sep 2023 07:31 AM (IST) Tags: Hyderabad Heavy Rain sanitation worker women dies

ఇవి కూడా చూడండి

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య

Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

టాప్ స్టోరీస్

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Telangana Elections 2023 : తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ - అదేమిటో తెలుసా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -  అదేమిటో తెలుసా ?

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, ఈసీ కూడా సీరియస్ - వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, ఈసీ కూడా సీరియస్ - వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Andhra News : సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !

Andhra News :  సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !