అన్వేషించండి
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
ఈ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రమాదం జరిగింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లేవారు తక్షణం స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

లారీని గుద్దిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కొడికొండ చెక్ పోస్ట్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్ జియా దుర్మరణం చెందాడు. ఆ సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉండగా, మొత్తం 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రమాదం జరిగింది. దీంతో ఆ రహదారి గుండా వెళ్లేవారు తక్షణం స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తం అయిన చిలమత్తూరు పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు అందించారు. గాయపడ్డవారిని హిందూపురం, బాగేపల్లి ఆసుపత్రలకు పోలీసులు తరలించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion