అన్వేషించండి

Pulivendula News : వివేకా హత్య కేసులో మరో సంచలనం, నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు!

Pulivendula News : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు వచ్చాయి. ఉమాశంకర్ రెడ్డి, స్వాతిని చంపుతామని పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 Pulivendula News  : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో A3 ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు వచ్చాయి. పులివెందులలోని స్థానిక పాత బస్టాండు సమీపంలో  పాల వ్యాపారం చేస్తున్న ఉమాశంకర్ భార్య స్వాతిని తన ఇంటి వద్ద శనివారం మధ్యాహ్నం సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి అతని కొడుకు కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. తన ఇంటి వద్దకు వచ్చి తనను కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని, నీ భర్త వైయస్ వివేకాను ఎలా చంపాడో అలాగే నీ భర్తను కూడా చంపుతామని బెదిరించారని స్వాతి అన్నారు. పరమేశ్వర్ రెడ్డి తన మీద చెప్పుతో దాడికి యత్నించాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో   స్వాతి చికిత్స పొందుతుంది. 

బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు 

"నిన్న మధ్యాహ్నం పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి వద్ద నాపై దాడి చేశాడు. నీ భర్త ఇంటికి వచ్చాక వివేకాను ఎలా చంపారో అలాగే చంపుతామని బెదిరించారు. నన్ను దుర్భాషలాడారు. నిన్ను కూడా చంపుతామని బెదిరించారు. నిన్ను ఇక్కడ లేకుండా చేస్తాం. కాలు చెప్పుతో నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను భయపడి ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకున్నాను. పరమేశ్వర్ రెడ్డి కొడుకు కూడా బూతులు తిట్టారు. నా సెల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా పరిస్థితి ఏంటో భయంగా ఉంది. నన్ను చంపుతామని హెచ్చరించారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలి. " - ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి 

వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు 

మాజీ మంత్రి, సీఎం జగన్‌కు బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడుగా విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్​ రెడ్డి విచారణకు రావాలని  మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు గత నెలలో ఆయన్ను సీబీఐ రెండుసార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిసీబీఐ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులను అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. భాస్కర్​ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఉంది. నిన్న రాత్రి పులివెందులకు వెళ్లి ఆరవ తేదీనే విచారణకు రావాలని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus Guidelines: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
PM Modi: ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన ప్రధాని మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
Kavitha Politics: కవిత 'రెబల్' అవతారం: KCR వ్యూహమా? BRSలో ప్రకంపనలా? లేఖ, సవాళ్లతో సంచలనం!
కవిత 'రెబల్' అవతారం: KCR వ్యూహమా? BRSలో ప్రకంపనలా? లేఖ, సవాళ్లతో సంచలనం!
Tollywood Strike News: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన నిర్మాతలు... ఫెడరేషన్ స్ట్రైక్ నేపథ్యంలో భేటికి ప్రాధాన్యత
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన నిర్మాతలు... ఫెడరేషన్ స్ట్రైక్ నేపథ్యంలో భేటికి ప్రాధాన్యత
Advertisement

వీడియోలు

Jr NTR Apologize to CM Revanth Reddy
Jawahar Lift Irrigation Project | జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
BCCI on Virat Kohli and Rohit ODI Retirement | విరాట్, రోహిత్ రిటైర్మెంట్ పై BCCI కీలక వ్యాఖ్యలు
Samantha Special Song in Peddi Movie | పెద్దిలో సమంత స్పెషల్ సాంగ్‌ ?
Nithin Movie with Pooja Hegde | నితిన్ కు జోడీగా పూజా హెగ్డే ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Free Bus Guidelines: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మార్గదర్శకాలు విడుదల
PM Modi: ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన ప్రధాని మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
ఢిల్లీలో ఎంపీల కోసం 184 ఫ్లాట్లు ప్రారంభించిన మోదీ, బిహార్ ఎన్నికలు గుర్తొస్తాయని సెటైర్లు
Kavitha Politics: కవిత 'రెబల్' అవతారం: KCR వ్యూహమా? BRSలో ప్రకంపనలా? లేఖ, సవాళ్లతో సంచలనం!
కవిత 'రెబల్' అవతారం: KCR వ్యూహమా? BRSలో ప్రకంపనలా? లేఖ, సవాళ్లతో సంచలనం!
Tollywood Strike News: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన నిర్మాతలు... ఫెడరేషన్ స్ట్రైక్ నేపథ్యంలో భేటికి ప్రాధాన్యత
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన నిర్మాతలు... ఫెడరేషన్ స్ట్రైక్ నేపథ్యంలో భేటికి ప్రాధాన్యత
Layout Regularisation Scheme: ఏపీలో అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొన్న వారికి గుడ్‌న్యూస్, LRSతో రెగ్యులరైజేషన్‌కు ఛాన్స్
ఏపీలో అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొన్న వారికి గుడ్‌న్యూస్, LRSతో రెగ్యులరైజేషన్‌కు ఛాన్స్
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో మంటలే... అభిజిత్ ఆన్ ఫైర్... సిద్దిపేట్ మోడల్ అవుట్!
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో మంటలే... అభిజిత్ ఆన్ ఫైర్... సిద్దిపేట్ మోడల్ అవుట్!
Cheapest Electric Scooter: దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Zelo Knight+ లాంచ్ - ధర వింటే మీరు షాక్ అవుతారు!
దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Zelo Knight+ లాంచ్ - ధర వింటే మీరు షాక్ అవుతారు!
Weather Updates: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Embed widget