అన్వేషించండి

Pulivendula News : వివేకా హత్య కేసులో మరో సంచలనం, నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు!

Pulivendula News : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు వచ్చాయి. ఉమాశంకర్ రెడ్డి, స్వాతిని చంపుతామని పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 Pulivendula News  : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో A3 ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు వచ్చాయి. పులివెందులలోని స్థానిక పాత బస్టాండు సమీపంలో  పాల వ్యాపారం చేస్తున్న ఉమాశంకర్ భార్య స్వాతిని తన ఇంటి వద్ద శనివారం మధ్యాహ్నం సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి అతని కొడుకు కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. తన ఇంటి వద్దకు వచ్చి తనను కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని, నీ భర్త వైయస్ వివేకాను ఎలా చంపాడో అలాగే నీ భర్తను కూడా చంపుతామని బెదిరించారని స్వాతి అన్నారు. పరమేశ్వర్ రెడ్డి తన మీద చెప్పుతో దాడికి యత్నించాడని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో   స్వాతి చికిత్స పొందుతుంది. 

బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు 

"నిన్న మధ్యాహ్నం పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి వద్ద నాపై దాడి చేశాడు. నీ భర్త ఇంటికి వచ్చాక వివేకాను ఎలా చంపారో అలాగే చంపుతామని బెదిరించారు. నన్ను దుర్భాషలాడారు. నిన్ను కూడా చంపుతామని బెదిరించారు. నిన్ను ఇక్కడ లేకుండా చేస్తాం. కాలు చెప్పుతో నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను భయపడి ఇంట్లోకి వెళ్లి డోర్ వేసుకున్నాను. పరమేశ్వర్ రెడ్డి కొడుకు కూడా బూతులు తిట్టారు. నా సెల్ ఫోన్ లాక్కున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా పరిస్థితి ఏంటో భయంగా ఉంది. నన్ను చంపుతామని హెచ్చరించారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలి. " - ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి 

వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు 

మాజీ మంత్రి, సీఎం జగన్‌కు బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడుగా విచారణ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్​ రెడ్డి విచారణకు రావాలని  మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు గత నెలలో ఆయన్ను సీబీఐ రెండుసార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లిసీబీఐ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులను అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. భాస్కర్​ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఉంది. నిన్న రాత్రి పులివెందులకు వెళ్లి ఆరవ తేదీనే విచారణకు రావాలని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Sells X: ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Sells X: ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం, ఎక్స్ సంస్థ విక్రయం - ఎంతకి అమ్మాడో తెలుసా
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
SBI clerk prelims Results 2025: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
Mad Square Day 1 Collections: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
Embed widget