Tamilnadu assembly: తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
Governor Ravi: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లాంఛనం. కానీ తమిళనాడు గవర్నర్ ప్రసంగించకుండా వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించారని ఆయనంటున్నారు.

Governor Ravi walks out of assembly: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవి , ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 2026 సంవత్సరపు తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఉదయం గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం ఉన్న తరుణంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) January 20, 2026
TamilNadu Governor RN Ravi skipped his customary address to the #TamilNadu Assembly after the state anthem was played, saying the national anthem was insulted!
Raj Bhavan accused the state of switching off his mic and giving him a speech with “unsubstantiated claims”… pic.twitter.com/kLtSjbFHca
ఈ వివాదానికి ప్రధాన కారణం జాతీయ గీతం. సభా నిబంధనల ప్రకారం సమావేశం ప్రారంభంలో రాష్ట్ర గీతం ఆలపించి, చివరలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనని, దానిని సమావేశం ప్రారంభంలోనే ఆలపించాలని గవర్నర్ పట్టుబట్టారు. రాష్ట్ర గీతంతోనే సభను ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠంలోని కొన్ని కీలక అంశాలను కూడా పక్కనపెట్టి, కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే సభ నుంచి నిష్క్రమించారు.
Chennai, Tamil Nadu: On Governor R. N. Ravi walking out of the Assembly, Chief Minister M. K. Stalin says, "The Governor has acted in a manner that disrespects this people’s Assembly, which has a long and proud tradition. Perarignar Anna once said that just as a goat does not… pic.twitter.com/gm8CiwFC9T
— IANS (@ians_india) January 20, 2026
గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో అనుసరిస్తున్న సంప్రదాయాలను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర గీతాన్ని ,సభా మర్యాదలను గవర్నర్ అవమానించారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఇదే అంశంపై ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండగా, వరుసగా మూడో ఏడాది కూడా అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభను కొనసాగించేలా ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
Chennai, Tamil Nadu: Governor R. N. Ravi walked out of the Tamil Nadu Legislative Assembly, stating he was disappointed that the National Anthem was not given due respect. pic.twitter.com/J0D3SwZdYy
— IANS (@ians_india) January 20, 2026
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, కేంద్రంలోని బీజేపీ నియమించిన గవర్నర్కు , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ పోరు రాజకీయ రంగు పులుముకుంది. శాంతిభద్రతల అంశం నుంచి భాషా విద్వేషాల వరకు ఇప్పటికే పలు అంశాల్లో డీఎంకే , బీజేపీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జాతీయ గీతం వర్సెస్ రాష్ట్ర గీతం వివాదం ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశంగా మారే అవకాశం ఉంది.





















