అన్వేషించండి

Crime News: ఏపీలో దారుణాలు - మహిళపై సామూహిక అత్యాచారం, నిందితులను పట్టించిన నల్లపూసల దండ

Andhra News: ఓ మహిళపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఘటన తూ.గో జిల్లాలో జరిగింది. నల్లపూసల దండ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Woman Abused And Murdered In East Godavari: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అటు, తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళపై నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని పర్లాఖెముండి ప్రాంతానికి చెందిన దంపతులు చాలాకాలం క్రితం కడియం మండలంలోని ఓ గ్రామానికి వచ్చి నర్సరీల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్రతిభావంతురాలైన కుమార్తెతో పాటు డిగ్రీ చదివే కుమారుడు ఉన్నారు. గత నెల 15న మహిళ అదృశ్యం కాగా.. 16న కడియం పీఎస్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తర్వాత రోజు ఆలమూరు మండలం చొప్పెల్ల వద్ద కాలువలో ఆమె మృతదేహం గుర్తించారు. 

సామూహిక అత్యాచారం, హత్య

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నలుగురు నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అక్టోబర్ 15వ తేదీన మహిళ నర్సరీలో పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా.. బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ (22) దారి కాచి బలవంతం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో సమీపంలోని మొక్కల్లోకి లాక్కెళ్లి నోట్లో తువ్వాలు కుక్కారు. ఆమె స్పృహ కోల్పోవడంతో నిందితులు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం రాత్రి 9 గంటలకు ఆమెను సమీపంలోని పంట కాలువలో పడేసి పరారయ్యారు. అయితే, మహిళ అప్పటికే మృతి చెందారా.?, లేక కాలువలో పడేసిన తర్వాత చనిపోయారా.? అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

నిందితులను పట్టించిన నల్లపూసల దండ

నర్సరీల వద్ద మృతురాలి కుమారుడి స్నేహితులకు నల్లపూసల దండ, గాజులు, రుమాలు, పిన్నులు కనిపించాయి. అయితే, ఘటన జరిగినప్పటి నుంచి పనులకు హాజరు కాని వారి గురించి పోలీసులు ఆరా తీయగా.. దేవర యేసు తెరపైకి వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ వివరాలతో మిగిలిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురినీ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నిత్యం గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు, పోలీసులు చెప్పారు. యేసు పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.

ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య

ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన చందా మాధవరాజు (30), ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అయితే, శుక్రవారం రాత్రి యువకుడు.. యువతి ఇంటికి వెళ్లాడు. తనకు యువతిని ఇచ్చి పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులను అడిగాడు. వారు నిరాకరించడంతో ఇంటి వరండాలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వారింగ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget