By: ABP Desam | Updated at : 18 Jul 2022 06:46 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పల్నాడు జిల్లాలో భార్యభర్తలు మృతి
Palnadu News : భర్త మరణించిన కొన్ని గంటల్లోనే భార్య మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. నాదెండ్ల మండలం గణపవరం అంబేడ్కర్ కాలనీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన తాళ్లూరి అచ్చయ్య (60) చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజీలో వాటర్ సర్వీసింగ్ పనిచేస్తుంటాడు. సోమవారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు. భర్త అచ్చయ్య మృతితో అతని భార్య చిట్టెమ్మ(55) తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త మృతి చెందిన గంటల వ్వవధిలోనే ఆమె కూడా కన్నుమూసింది. చిట్టెమ్మ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో భర్త మృతి చెందిన గంటల వ్యవధిలో చిట్టెమ్మ మృతి చెందటంతో కాలనీలో విషాదం అలముకుంది. మృతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ ఘటన స్థానికులు ప్రతి ఒక్కరిని కదిలించింది.
SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ఆన్లైన్లో మెక్సికన్ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
/body>