అన్వేషించండి

Pak Terror Attack: పాకిస్తాన్‌లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి- నలుగురు చిన్నారులు మృతి, 38 మందికి గాయాలు

Terror Attack In Pakistan | పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్కూల్ బస్సు లక్ష్యంగా చేసుకుని ఆత్మహత్యా దాడి జరిగింది. నలుగురు స్కూల్ విద్యార్థులు చనిపోయారు.

Pakistan School Bus Terror Attack: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. తాజాగా కొందరు ఉగ్రవాదులు స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని సూసైడ్ బాంబు పేల్చారు. బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్‌లో జరిగిన సూసైడ్ బాంబర్ చేసిన దాడిలో నలుగురు పిల్లలు చనిపోగా, మరో 38 మంది గాయపడ్డారు. అధికారిక సమాచారం ప్రకారం, వ్యక్తి ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగింది.

పాకిస్తాన్ వార్తా వెబ్‌సైట్ డాన్ ప్రకారం.. స్కూల్ బస్సు జీరో పాయింట్ దగ్గర వెళ్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి బాంబులతో వచ్చి పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో స్కూల్ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయాలైన వారిని క్వెట్టా, కరాచీ ఆసుపత్రులకు తరలించారు. పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వి ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. స్కూల్ విద్యార్థులకు లక్ష్యంగా చేసుకుని చేసిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు.

దేశానికి వ్యతిరేకంగా కుట్ర - మొహ్సిన్ నక్వి

పాకిస్తాన్ గృహశాఖ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. సూసైడ్ బాంబు దాడిలో చనిపోయి పిల్లల కుటుంబాలకు మంత్రి మొహ్సిన్ నక్వి సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలిపారు. శత్రువులు అమాయక చిన్నారులను బలిగొన్నారని, దేశంలో అస్థిరతను సృష్టించే దుష్ట కుట్ర జరుగుతోంది. దేశంలో అశాంతి సృష్టించేందుకు కొన్ని గ్రూపులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. దోషులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

ఖుజ్దార్ జిల్లాలో ఓ బస్సు నగరంలోని సైనిక పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget