అన్వేషించండి

Nellore Police Suspend : నెల్లూరు జిల్లాలో దివ్యాంగుడి ఆత్మహత్య, నలుగురు పోలీసులు సస్పెండ్

Nellore Police Suspend : నెల్లూరు జిల్లాలో దివ్యాంగుడి ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. మర్రిపాడు ఎస్సైతో సహా ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ విజయరావు సస్పెండ్ చేశారు.

Nellore Police Suspend : నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ దివ్యాంగుడి ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణల ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. మర్రిపాడు ఎస్‌.ఐ వెంకటరమణ, ఏఎస్‌ఐ జయరాజ్‌, కానిస్టేబుళ్లు ఎస్‌.కె చాంద్‌ బాషా, సంతోష్‌ కుమార్‌ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలేం జరిగింది ?

మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన దివ్యాంగ యువకుడు తిరుపతిని ఓ చోరీ కేసులో వారంలో మూడుసార్లు పోలీసులు విచారణకు పిలిచారు. పోలీసులు తమ కుమారుడిని శారీరకంగా వేధించారని, అందుకే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ తిరుపతి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ విజయరావు విచారణ చేసి నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 

ఫెన్సింగ్ విషయంలో వివాదం

నెల్లూరు జిల్లాలోనే అనంతసాగరం మండలం గుడిగుంట్లకు చెందిన పొట్టపల్లి శ్రీనివాసులు, లక్ష్మమ్మ ఉపాధి కోసం చుంచులూరుకు వలసవచ్చారు. వారికి దివ్యాంగుడైన కుమారుడు తిరుపతి ఉన్నాడు. చుంచులూరులో ఆ కుటుంబం కృష్ణమూర్తి  అనే రైతుకి చెందిన పొలానికి కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉండేది. సరిగా నడవలేని తిరుపతి ఇంటి దగ్గరే ఉండేవాడు.  కృష్ణమూర్తికి చెందిన పొలం పక్కనే ఆందనేయ రెడ్డి అనే వ్యక్తికి కూడా పొలం ఉండేది. ఆ పొలానికి వేసిన ఫెన్సింగ్ కంచెను ఎవరో దొంగతనం చేశారు. దొంగతనం చేసినవారిని విచారించే క్రమంలో స్థానిక ఎస్సై వెంకట రమణ తిరుపతిని స్టేషన్ కి పిలిపించారని సమాచారం. అయితే విచారణ పేరుతో ఎస్సై వెంకట రమణ తమ కుమారుడు తిరుపతిని స్టేషన్ కి పిలిపించి కొట్టేవారని ఆరోపించారు తిరుపతి తల్లిదండ్రులు. ఈ క్రమంలో తమ కుమారుడు తీవ్రంగా బాధపడేవాడని, కనిపించని దెబ్బలతో ఇబ్బంది పడ్డాడని అంటున్నారు. మూడోసారి కూడా పోలీసులు స్టేషన్‌ కు పిలవడంతో భయంతో తమ కుమారుడు తిరుపతి పురుగుల మందు తాగాడని చెబుతున్నారు తల్లిదండ్రులు.

ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

పురుగుల మందు తాగడంతో ముందుగా తిరుపతిని నెల్లూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు తమను అడ్డుకుని తమ కుమారుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ తమ కుమారుడు మరణించాడని చెప్పారు. ఎస్సై వెంకట రమణపై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు, మర్రిపాడు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. 

Nellore Police Suspend : నెల్లూరు జిల్లాలో దివ్యాంగుడి ఆత్మహత్య, నలుగురు పోలీసులు సస్పెండ్

ఇటీవల మరో ఘటన

నెల్లూరు పోలీసుల సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ఎస్సై వెంకట రమణపై పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈసారి మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పోలీసుల వేధింపుల కేసు మరొకటి వెలుగు చూసింది. నెల్లూలు రూరల్ మండల పరిధిలో ఓ వ్యక్తి మరణానికి ఎస్సై కారణమంటూ ఆరోపించారు టీడీపీ నేతలు. దీనికోసం చలో నెల్లూరు కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఆ వ్యవహారంలో పోలీసులు తమ తప్పేమీ లేదని చెప్పారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ టీడీపీ నేతలు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మర్రిపాడు ఘటనతో మరోసారి టీడీపీ నేతలు పోలీసులపై ఆరోపణలు ఎక్కుపెట్టింది. దీంతో వెంటనే పోలీసులు ఎంక్వైయిరీ మొదలు పెట్టి చర్యలు తీసుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget