అన్వేషించండి

Nellore News : విదేశాలకు వెళ్తానని పట్టుబట్టిన కొడుకు, ఆత్మహత్య చేసుకున్న తల్లి!

కొడుకు తాను విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

కన్నబిడ్డలు విదేశాల్లో ఉన్నా.. వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ సంతోషపడుతుంటారు తల్లిదండ్రులు. అక్కడి నుంచి వారు ఆర్థికంగా సాయం చేసినా చేయకపోయినా వారి గురించి మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. బిడ్డలు ఫారిన్ లో ఉండటం గొప్పగా భావిస్తారు తల్లిదండ్రులు. కానీ కొంతమంది మాత్రం బిడ్డలను వదిలిపెట్టి ఉండలేరు. దూరపు కొండలు నునుపు అంటూ వెళ్లి తిప్పలు పడటం ఎందుకని అంటారు. బిడ్డలు కళ్లముందే ఉండాలని కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులే నెల్లూరులో ఉన్నారు. అయితే కొడుకు మాత్రం తాను విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో చివరకు తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ విషాదంగా మారింది. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదంగా మారింది. 

నెల్లూరులోని న్యూమిలట్రీ కాలనీలోని ఆరో క్రాస్ రోడ్డులో సాయిబాబా మందిరం వద్ద చల్లా పెంచల నరసింహారెడ్డి, విజయకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సదాశివ రెడ్డి, భరత్‌ రెడ్డి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ అవివాహితులే. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. భరత్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.

ఎక్కడికీ వెళ్లొద్దు..

పెద్ద కొడుకు సదాశివరెడ్డి విదేశాలకు వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిరాకరించారు. తమ వద్దే ఉండాలని, ఇక్కడే ఉండి కుటుంబ బాధ్యతలు చేపట్టాలని వారు కొడుకుకు సూచించారు. కానీ సదాశివరెడ్డి మాత్రం వారి మాట వినలేదు. తాను విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు ససేమిరా అనడం, కొడుకు విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఆ కుటుంబంలో కలతలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇటీవల తండ్రి నరసింహారెడ్డి అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లాడు. ఈనెల 18న శబరిమలకు వెళ్లిన ఆయన త్వరలో తిరిగి రావాల్సి ఉంది. ఈలోగా ఇంట్లో ఘోరం జరిగిపోయింది. తండ్రి శబరిమల వెళ్లిన తర్వాత మరోసారి తన అభిప్రాయం వెలిబుచ్చాడు కొడుకు. తాను ఎలాగైనా విదేశాలకు వెళ్లాల్సిందేనన్నాడు. కానీ తల్లి విజయకుమారి మాత్రం ససేమిరా అంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

ఈనెల 25న విదేశాలకు వెళ్లేందుకు పెద్ద కొడుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తమ్ముడు ఈ విషయంలో ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి తిరిగి వచ్చేలోపు కొడుకు తన మాట వినకుండా ఫారిన్ వెళ్లిపోతాడేమోనని భయపడింది తల్లి విజయకుమారి. బిడ్డను వారించినా మాట వినడని తేలిపోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కానీ కొడుకు అంత సీరియస్ గా తీసుకోలేదు. చివరకు విజయకుమారి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయింది. బుధవారం ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే కొడుకు ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వేదాయపాళెం పోలీసులకు తమ్ముడు భరత్‌ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ కు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

టాప్ హెడ్ లైన్స్

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget