అన్వేషించండి

Mulugu Crime : ములుగు జిల్లాలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

Mulugu Crime : వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో ప్రియుడి మోజులో భార్య భర్తను హత్య చేసింది.

Mulugu Crime :  ప్రియుడితో కలిసి భర్తను హతమర్చిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పూరూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం హతమార్చిన ఘటన వాజేడు మండలంలో కలకలం రేపుతోంది. వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గొడ్డె బసవయ్య, సుజాత భార్య భర్తలు. అయితే బసవయ్య భార్య సుజాత అదే గ్రామానికి చెందిన దర్శన్ బాబుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై భార్య, భర్తలు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టుకొని వార్నింగ్ ఇచ్చారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ప్రియుడు పెండకట్ల దర్శన్ బాబుతో కలిసి బసవయ్యను భార్య సుజాత హతమార్చింది. బసవయ్య బావ గోట లాలయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పేరూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బసవయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. 

మర్డర్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ 

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసే ఓ అనాథ డ్రైవర్ పేరిట అతడికి తెలియకుండా బ్యాంకులో 52 లక్షల లోన్ తీసుకున్నాడు. మరో 50 లక్షల రూపాయల బీమా కూడా తీసుకున్నాడు. ఆపై పోలీసులకు డబ్బు ఆశ చూపించి అతడిపై హత్యకు ప్లాన్ చేశారు. ఫుల్లుగా మద్యం తాగించి హాకీ స్టిక్ తో దాడి చేశారు. శవాన్ని రోడ్డుపై పెట్టి దానిపైనుంచి రెండు సార్లు కారును పోనిచ్చారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం జరిగిన ఆ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతాండాకు చెందిన బోడ శ్రీకాంత్ మోసాలకు పాల్పడుతూ జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. అయితే హైదరాబాద్ శివారు మోడిపల్లికి చెందిన 34 ఏళ్ల భిక్షపతి అతని వద్ద డ్రైవర్ గా పని చేసేవాడు. అనాథ అయిన అతని పేరుపై శ్రీకాంత్ ఓ సంస్థలో 50 లక్షల రూపాయలకు బీమా చేయించాడు. అతడి పేరిటే మరో 52 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. దానికి నామినీగా అతని పేరు పెట్టుకున్నాడు. అనంతరం భిక్షపతిని హత మార్చేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతీలాల్ తో పాటు తన దగ్గర పని చేసే సతీష్, సమ్మన్నలకు డబ్బు ఆశ చూపించాడు. డబ్బులు తీసుకున్న వాళ్లు.. భిక్షపతిని చంపేందుకు సాయం చేశారు.  

బీమా డబ్బుల కోసం 

మోతీలాల్ వేసిన పథకం ప్రకారం.. 2021 డిసెంబర్ 22వ తేదీన భిక్షపతిని కారులో ఎక్కించుకొని బాగా మద్యం తాగించారు. అర్ధరాత్రి షాద్ నగర్ కు చేరుకొని.. అటు నుంచి మొగలిగిద్ద వైపు పయనం అయ్యారు. గ్రామ శివారులో అతనిపై హాకీ స్టిక్ తో దాడి చేసి హత్య చేశారు. శవాన్ని రోడ్డుపై ఉంచి రెండుసార్లు కారును పైనుంచి పోనిచ్చారు. ఇలా చేయడంతో భిక్షపతి మృతదేహం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం అనంతరం హత్యగా ధ్రువీకరించారు. బీమా డబ్బుల కోసం నిందితులు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో పోలీసులకు క్లూ దొరికింది. బీమా సంస్థ నిర్వాహకులు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం పోలీసులను సంప్రదించారు. బీమా డబ్బుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి భిక్షపతితో బంధుత్వం లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు రంగంలోకి దిగి పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఉద్యోగాల ఆశ పెట్టి కొందరు యువకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకుల్లో డబ్బులు కాజేయడంతో గతంలో నాచారం పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ పై కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget