అన్వేషించండి

Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం

ఏలూరులో కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఏలూరులో కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తుపట్టలేనంతగా ఓ వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటిపై ఉన్న గదిలో వృద్ధురాలి మృతదేహం ఉండగా.. అదే ఇంట్లో కింది గదిలో ఉంటున్న తన కోడలికి విషయం తెలియకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకే కన్నతల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు మూడు నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటి పై గదిలో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు లోనితంగెళ్ళమూడి యాదవ్ నగర్ మహిషాసుర మర్దిని ఆలయ సమీపంలో శరణార్థి నాగలక్ష్మి (75) నివాసం ఉంటుంది. భర్త మల్లికార్జునరావు విజయవాడ ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన మృతి చెందారు. వచ్చే పింఛన్తో సొంత ఇంటిలోనే పై భాగంలో వృద్ధురాలు నివసిస్తుంది. ఆమె కుమారుడు దుర్గ ప్రసాద్, భార్య లలితాదేవి కింద పోర్షన్లో ఉంటున్నారు. వృద్ధురాలు ఇంటి తలుపులు మూసి ఉండటం, ఆమె కనిపించకపోవడం,  ఎంతకీ దుర్వాసన తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  

మంగళవారం పోలీసులు సిబ్బందితో అక్కడికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా వృద్ధురాలి మృతదేహం కనిపించింది. అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో పురుగులు పట్టి వృద్ధురాలి మృతదేహం కనిపించింది. దీన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆమె మృతి చెంది మూడు నెలలై ఉంటుందని ప్రాధమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అనంతరం మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగలక్ష్మి కి ఆమె కుమారుడు ప్రసాద్కు కొంతకాలం నుంచి మాటలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడే ఏదైనా చేశాడా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు పోలీసులు వచ్చిన దగ్గరనుంచి అతను కనిపించలేదు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మూడు నెలల కిందట ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వాళ్ళు అడగగా పిల్లి చనిపోయిందని తీయించి వేస్తామని అతడు చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

మృతురాలి కోడలు లలిత మాత్రం తనకు ఏమీ తెలియదని తన అత్తగారు తమకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. పిల్లి చనిపోయిందని అందుకే దుర్వాసన వస్తుందని చుట్టుపక్కల వారిని నమ్మించారు. ఇప్పుడు తీరా వృద్ధురాలు మృతదేహం బయటపడగానే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొడుకు దుర్గాప్రసాద్ తన తల్లిని చంపి భయంతో మృతదేహాన్ని పై ఫ్లోర్ దాచి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతురాలు నాగమణి మృతదేహాన్ని మూడు నెలలగా దాచిపెట్టడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆమె సహజంగా మరణిస్తే ఎందుకు ఇన్ని రోజులు మృతదేహాన్ని దాచిపెట్టారు? ఒకవేళ ఇది హత్య? అయితే దీనికి గల కారణాలు ఏమిటి? లేకపోతే ఆత్మహత్య? అయితే మృతదేహం కుళ్ళిపోయే వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget