అన్వేషించండి

పండుగ పూట విషాదం, విద్యుత్ షాక్ తో తల్లీ, బిడ్డ మృతి! 

మంచిర్యాల జిల్లాలో పండగ పూటే విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై తల్లితో పాటు ఆమె బిడ్డ కూడా మృతి చెందింది. కాపాడేందుకు వెళ్లిన భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన జెల్ల సమ్మయ్య (35), జెల్ల సరిత (28) దంపతులకు 13 నెలల వయసు ఉన్న కూతురు శ్రవన్విత ఉంది. వీరంతా గ్రామంలోనే నివసిస్తూ.. వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తారు. ప్రతిరోజూ లాగే నిన్న కూడా ఈ ముగ్గురు తమ పొలంలో పని కోసం వెళ్ళారు. సాయంత్రం పూట తిరిగి వచ్చే క్రమంలో రోజు వచ్చే దారిన కాకుండా మరో దారిలో నడిచారు. అదే వారి పాలిట శాపంగా మారింది. బిడ్డను చంకన వేస్కొని పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ తీగ చూస్కోకుండా అడుగు వేసింది సరిత. అంతే ఒక్కసారిగా షాక్ కొట్టి పడిపోయింది. విషయం గుర్తించిన భర్త వీరి ప్రాణాలు కాపాడబోయాడు. కానీ సమ్మయ్య కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. 


పండుగ పూట విషాదం, విద్యుత్ షాక్ తో తల్లీ, బిడ్డ మృతి! 

ఎంతకీ ఇంటికి రాకపోవడంతో..

అర్ధరాత్రి అవుతున్నా వారు ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూశారు. సమయ్య గాయాలతో కనిపించగా... అతని భార్య సరిత, కూతురు శ్రవన్విత శరీరం సగం వరకు కాలిపోయి మృతి చెందినట్లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన సమ్మయ్యను అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సమ్మయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం తల్లీ, బిడ్డ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అదే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకూతురినే చంపింది.. 

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ఓ తల్లి తన ఆరు సంవత్సరాల వయసున్న కుమార్తెను చంపింది. ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. పోలీసులు విచారణ జరపగా, స్వయంగా నిందితురాలే నేరాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు వివరించారు. శవాన్ని మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో పడేశారు. ఆ సంఘటన స్థలాన్ని  పోలీసులు పరిశీలించగా, అక్కడ ఆమె కుమార్తె శవం లభ్యం అయింది. పోలీసులు శవాన్ని పోస్టు మార్టానికి పంపించారు.

భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని భవానిపురానికి చెందిన దుర్గా భవాని తన భర్త గురునాథంతో కలిసి మేస్త్రి పనులు చేసుకోవడానికి నిజామాబాద్‌కు వచ్చింది. ఇద్దరూ కలిసి నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరికి నాగలక్ష్మి (6), గీతా మాధవి (14 నెలలు) పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా కుటుంబ పోషణ భారం కావడంతో గురునాథం ఆటోను తీసుకొని నడుపుతున్నాడు. చాలా కాలం నుంచి దుర్గ భవాని భర్తతో తరచుగా గొడవ పడుతూ ఉంది. ఈ క్రమంలో తన భర్తకు దూరంగా ఉండాలని భావించిన దుర్గా భవాని గత నెల రోజులుగా విడిపోయి దూరంగా ఉంటోంది. నిజామాబాద్ నగరంలోనే తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తుంది. అంతకుముందే ఆమెకు బాన్సువాడకు చెందిన ద్యారంగుల శ్రీను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త గురునాథానికి తన భార్య దుర్గా భవాని ఎక్కడ ఉందో తెలియలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే, డబ్బుల కోసం దుర్గా భవాని తన తల్లికి ఫోన్ చేసింది. అప్పటికే గురునాథం తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. ఆమె తన అత్తకు ఫోన్ చేసిన విషయం పోలీసులకు చెప్పాడు. వారు ఆ ఫోన్ నెంబరు ఆధారంగా దుర్గా భవాని నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. గురునాథం భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. పిల్లల గురించి ఆరా తీయగా చిన్న పాప నిద్ర పోతోందని, పెద్ద కుమార్తె ఆరేళ్ల నాగలక్ష్మి శ్రీను అనే తన బంధువుల ఇంటి దగ్గర ఉందని నమ్మ బలికింది. దీంతో భర్త నాకు తెలియని బంధువులు ఇక్కడ ఎవరు ఉన్నారని నిలదీశాడు. దీంతో పెద్ద కూతుర్ని చంపేసినట్లుగా ఒప్పుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget