By: ABP Desam | Updated at : 12 Dec 2021 02:58 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు అత్యంత వేగంగా ఢీకొంది. ఈ ఘోర ప్రమాద ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్లోనే మరణించారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుండిగల్లోని బౌరంపేట కోకాకోలా కంపెనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తు అని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫూటుగా మద్యం తాగిన యువకులు కారు నడుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బౌరంపేట కోకాకోలా కంపెనీకి సమీపంలో కారు రాగానే ఆగి ఉన్న ట్రక్కును బలంగా వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని ఏలూరు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. చరణ్ అనే వ్యక్తిది విజయవాడ కాగా.. సంజూ, గణేశ్ అనే వారిది ఏలూరు అని పోలీసులు వెల్లడించారు. గాయపడిన అశోక్ ప్రస్తుతం సూరారంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రమాదం జరిగిన సమయంలో చరణ్ అనే వ్యక్తి కారు నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి మద్యం మత్తులో కారు అతివేగంగా నడపడమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా, వీరంతా నిజాంపేట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నల్లకుంటలో మరో ప్రమాదం
మద్యం మత్తులో హైదరాబాద్లో మరో ప్రమాదం జరిగింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున విద్యానగర్ రైల్వే బ్రిడ్జిపైకి ఓ కారు దూసుకొచ్చింది. అది అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. అయితే, ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో అతనికి పోలీసులు శ్వాస పరీక్షలు చేయగా.. 90 శాతం రీడింగ్ చూపించింది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, వాహనదారుడిపై కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad: నా భర్త సైకోలా వేధించాడు... సూసైడ్ నోట్ రాసి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !
Crime News : బెజవాడలో కాల్మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !
రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు
Baby Kidnap: కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం, 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!
Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం
కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ
Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ
KTR : ఆసియా లీడర్స్ మీట్కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ఫైర్ !