అన్వేషించండి

Rajahmundry: బీడీ కోసం గొడవ.. ప్రత్యర్థిని చంపుదామని కత్తి తీసుకెళ్లిన వ్యక్తి, చివరికి ట్విస్ట్ మామూలుగా లేదు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య బీడీ కోసం జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది.

ఒక బీడీ ముక్క వల్ల తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటనలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బీడీ విషయంలో చాలా రోజుల క్రితం వీరు గొడవ పడగా.. ఆ పగతో తాజాగా నిందితుడు హత్య చేయడం గమనించదగ్గ విషయం. వీరిద్దరూ రౌడీ షీటర్లేనని పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య బీడీ కోసం జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. రాజమహేంద్రవరం థర్డ్ టౌన్ పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక భాస్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన జీరా వెంకట తోటయ్య రెడ్డి అనే 24 ఏళ్ల యువకుడు కొన్ని దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన యర్రా సాయి కిరణ్‌ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వీరు ఇద్దరు జైలులో రిమాండ్‌లో ఉన్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.

Also Read: Cyclone Gulab: ఉత్తరాంధ్రకు 'గులాబ్' తుపాను ముప్పు.. తెలంగాణలోనూ భారీ వర్షాలు 

ఒక బీడీ కోసం వారికి మాటామాటా పెరిగి అది ఘర్షణకు దారి తీసింది. తోటయ్య రెడ్డి జైల్లో సాయి కిరణ్‌పై దాడికి పాల్పడ్డాడు. కొద్ది కాలానికి ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. బయట కూడా చాలా సార్లు ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి ఇద్దరి మధ్య తగాదా జరిగింది. దీంతో అర్ధ రాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలోనూ తోటయ్య రెడ్ఢి కత్తితో నగరంలోని సుబ్బారావుపేట దానవాయిబాబు గుడి వద్ద ఉన్న సాయి కిరణ్‌ ఇంటికి వెళ్లాడు. తోటయ్య రెడ్డి తెచ్చిన కత్తితో అతడినే పొడిచి వంట కోసం వాడే ప్రెషర్ కుక్కరు మూత, కర్రతో దాడి చేసి తోటయ్య రెడ్డిని సాయి కిరణ్‌‌ చంపేశాడు. నిందితుడు సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు చెప్పారు. 

Also Read: Tollywood Vs Jagan : టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం పగ సాధిస్తోందా ? పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ?

పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత
మరోవైపు, రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండల్‌ కొవడ గ్రామానికి చెందిన కుంచినిపల్లి వీరబాబు(28), విశాఖపట్నం జిల్లా మాకవానిపాలెం గ్రామానికి చెందిన రత్తుల శ్రీనివాస్‌రావు జల్సాలకు అలవాటు పడి విలాసంతమైన జీవితాన్ని గడిపేందుకు గంజాయి సరఫరా చేసే కిట్టు అలియాస్‌ శ్రీనివాస్‌ను కలిశారు.

తాము హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు గంజాయిని సరఫరా చేస్తామంటూ.. ఒప్పందానికి వచ్చారు. ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 22న కిట్టు సుమారు 23.140 కిలోల గంజాయిని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ తరలించాలని, అందుకు రూ.20 వేలు నుంచి రూ.30 వేలు ఇస్తానంటూ.. వీరబాబు, శ్రీనివాస్‌రావులకు చెప్పాడు. ఈ క్రమంలో రాజమండ్రికి వెళ్లిన ఇద్దరు అక్కడ గంజాయిని 9 ప్యాకెట్లలో నింపుకొని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ బొమ్మగల్ల సురేశ్‌‌ను సంప్రదించారు.

తమతో పాటు హైదరాబాద్‌కు గంజాయిని తరలించాలని కోరగా, అందుకు అంగీకరించిన సురేశ్‌.. ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్‌ చేశాడు. వారి మధ్య ఒప్పందం జరిగిన అనంతరం వాహనంలో గంజాయిని తీసుకుని నగరానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు కొత్తపేట బీజేఆర్‌ భవన్‌ సమీపంలోని టెలీఫోన్‌ కాలనీ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read: Gold-Silver Price: స్థిరంగా పసిడి ధర.. వెండి మాత్రం దిగువకు.. నేటి తాజా ధరలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget