అన్వేషించండి

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

కర్నూలు జిల్లా కామవరంలో జంట హత్యలు కలకలం రేపాయి. భూతగాదాలో వైసీపీ, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో వేట కొడవళ్లతో దాడి చేసి ప్రత్యర్థులను హత్య చేశారు.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో భూ తగాదాలు హత్యలకు దారితీశాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరు హత్యకు గురికాగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శివప్ప, ఈరన్నను వేట కోడవలతో నరికి పెట్రోలు పోసి తగలబెట్టారు ప్రత్యర్థులు. శివప్ప, ఈరన్న అక్కడికక్కడే మృతి చెందారు. శివప్ప, ఈరన్న వైఎస్సార్సీపీకి చెందినవారు. ప్రత్యర్థి వర్గం బీజేపీలో ఉన్నారు. భూ వివాదంలో ఒకరికి వైసీపీ మద్దతు ఇవ్వగా మరొకరికి బీజేపీ మద్దతు ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివప్ప స్థానిక సర్పంచ్‌ సోదరుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ

కౌతాళం మండలం కామవరంలో జరిగిన జంట హత్యల ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు.  బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. భూ వివాదాలే ఈ జంట హత్యలకు కారణమని ఎస్పీ తెలిపారు. కళ్లలో కారంపొడి చల్లి, గొడ్డళ్లు, రాడ్లతో దాడి చేసి హత్య చేశారన్నారు. ఎస్సీ కమ్యునిటీకి చెందిన శివప్ప, ఈరన్నలు చనిపోయారన్నారు. మరో నలుగురు గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని...వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే...

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య గత కొన్ని రోజులుగా భూవివాదం నడుస్తోంది. గురువారం ఈ వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలు శివప్ప(45), గట్టు ఈరన్న (47) మరణించారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. పెట్రోల్‌, యాసిడ్‌ స్ప్రే చేసి, కళ్లలో కారం పొడి చల్లి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆదోని పట్టణానికి చెందిన బోయ మునేంద్ర రాజ్‌కుమార్‌కు చెందిన సర్వే నెంబర్‌ 254/ఉ లో నాలుగు ఎకరాలు, సర్వే నెంబర్‌ 254/అలో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 22 ఏళ్ల క్రితం గ్రామంలోని వడ్డే రామాంజి, వడ్డే రాజు, వడ్డే మల్లికార్జున, వడ్డే ఈశ్వర్‌, వడ్డే గోపాల్‌లు అమ్మినట్లు అన్నదమ్ములు ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోవడంతో ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ భూమిని వడ్డే రామాంజి కుటుంబం సాగు చేస్తున్నారు. 

పక్కా ప్లాన్ తో

ఈ విషయంపై ఇరువర్గాలు కోర్టుకు వెళ్లాయి. కోర్టు తీర్పు మునేంద్ర రాజ్‌కుమార్‌కు అనుకూలంగా రావడంతో స్థానిక సర్పంచి వసంత్‌ కుమార్‌ సోదరులు పొలం విషయం చర్చకు పిలిచారు. ఈ విషయాన్ని బీజేపీలో ఉన్న వడ్డే గోపాల్‌ విలేకరులతో సమావేశం పెట్టి వైసీపీ మండల నాయకుడు మహేందర్‌రెడ్డి భూకబ్జాలు మానుకోవాలని కోరారు. తమ భూమి పంచాయితీలో తలదూర్చవద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో భూవివాదంతో ఎటువంటి సంబంధంలేని తమ నాయకునిపై ఆరోపణలు ఎలా చేస్తారని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివప్ప, ఈరన్న, సత్యప్ప, అయ్యప్ప, బజారప్ప, పెద్ద తిమోతి, ఇస్మాయిల్‌తో పాటు మరికొందరు బీజేపీ నాయకులు వడ్డే గోపాల్‌ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు దాడికి దిగారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటి వద్దకు రాగానే పెట్రోల్‌, క్రిమిసంహారక మందు వాళ్లపై స్ప్రే చేసి, కళ్లల్లో కారం చల్లారు. తర్వాత వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో  వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget