అన్వేషించండి

Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!

Kerala Sharon Raj Murder Case: సంచలనం రేపిన శరోన్ రాజ్‌ హత్య కేసులో అతడి ప్రియురాలికి కోర్టు ఉరిశిక్ష విధించింది. తిరువనంతపురం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

Death Sentence to Lover | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య కేసులో యువతికి కోర్టు మరణశిక్ష విధించింది. 2022లో కేరళలో ప్రియుడు శరోన్ రాజ్‌కు విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి హత్య చేసింది గ్రీష్మ. ఈ కేసులో ఇదివరకే విచారణ పూర్తయింది. గ్రీష్మను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఈ హత్యలో ఆమెకు సహకరించిన బంధువుకు న్యాయమూర్తి మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఓ వ్యక్తి ప్రాణం తీయడం హేయమైన నేరమని, అంత పెద్ద తప్పు చేసిన శరోన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు తిరువనంతపురం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే..
తిరువనంతపురానికి చెందిన శరోన్ రాజ్ (23) హత్య కేసులో అతడి ప్రియురాలు గ్రీష్మకు కేరళ కోర్టు సోమవారం (జనవరి 20న) మరణశిక్ష విధించింది. బీఎస్సీ రేడియాలజీ చివరి సంవత్సరం విద్యార్థి శరోన్ రాజ్, తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన గ్రీష్మ ఓ కాలేజీలో చదువుకునే సమమయంలో ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం ప్రేమగా మారి, దాదాపు ఏడాదిపాటు వీరు రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆర్మీలో పనిచేసే వ్యక్తితో 2022లో వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని ప్రియుడు శరోన్ రాజ్‌కు చెప్పి, అతడ్ని దూరం పెట్టడం ప్రారంభించింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శరోన్ రాజ్ ఆమె ప్రేమ తనకే దక్కాలని పదేపదే ఆమెకు చెప్పి చూశాడు. మరోవైపు పెళ్లికి సమయం దగ్గర పడుతుండటం, శరోన్ రాజ్ ఏమో తనను వదిలి పెట్టవద్దని గ్రీష్మతో చెబుతూనే ఉన్నాడు. 

ప్లాన్ ప్రకారం హత్య
ఎలాగైనా ప్రియుడ్ని వదిలించుకోవాలని చూసిన గ్రీష్మ ఏకంగా అతడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసింది. తన మామతో కలిసి ప్రియుడు శరోన్ రాజ్ హత్య చేయాలని భావించింది. అక్టోబర్ 14, 2022న కన్యాకుమారిలోని తన నివాసంలో గ్రీష్మ వద్దకు వెళ్లిన సమయంలో విషం కలిపిన జూస్ ఇవ్వగా శరోన్ రాజ్ తాగాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన అతడు కొన్నిరోజుల్లోనే చనిపోయాడు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గ్రీష్మ ఫ్యామిలీపై కేసు నమోదైంది. 

డీవైఎస్పీ జాన్సన్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు దర్యా్ప్తు చేపట్టింది. అక్టోబర్ 31, 2022న గ్రీష్మను అరెస్టు చేశారు. ఏడాది పాటు కస్టడీలో ఉన్న గ్రీష్మ, కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సెప్టెంబర్ 25, 2023న జైలు నుంచి విడుదలైంది. మరోవైపు దర్యాప్తులో గ్రీష్మ, ఆమె మామ కలిసి ఇదంతా చేసినట్లు పోలీసులు గుర్తించి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. విచారణ చేపట్టిన
నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జనవరి 17న ఇద్దరినీ దోషులుగా తేల్చారు. ఐపీసీ సెక్షన్లు 364, 328, 302 (హత్యకు శిక్ష), 201 సెక్షన్ల కింద కింద గ్రీష్మను దోషిగా తేల్చింది. తన స్వార్థం చూసుకునేందుకు ఓ వ్యక్తిని హత్య చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేసి పోలీసులను తప్పుదోవ పట్టించడం లాంటి విషయాలను కోర్టు తీవ్రంగా పరిగణించి తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్రీష్మ తల్లికి సంబంధం ఉందని బాధిత కుటుంబం ఆరోపించింది. కానీ అందుకు సాక్ష్యాలు లభ్యంకాకపోవడంతో ఆమెను నిర్దోషిగా కోర్టు తేల్చింది. 

Also Read: Free Mobile Fraud: ఆఫర్ కింద టెకీకి మొబైల్‌ గిఫ్ట్‌, సిమ్ వేయగా రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Embed widget