అన్వేషించండి

Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!

Kerala Sharon Raj Murder Case: సంచలనం రేపిన శరోన్ రాజ్‌ హత్య కేసులో అతడి ప్రియురాలికి కోర్టు ఉరిశిక్ష విధించింది. తిరువనంతపురం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

Death Sentence to Lover | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య కేసులో యువతికి కోర్టు మరణశిక్ష విధించింది. 2022లో కేరళలో ప్రియుడు శరోన్ రాజ్‌కు విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి హత్య చేసింది గ్రీష్మ. ఈ కేసులో ఇదివరకే విచారణ పూర్తయింది. గ్రీష్మను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఈ హత్యలో ఆమెకు సహకరించిన బంధువుకు న్యాయమూర్తి మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఓ వ్యక్తి ప్రాణం తీయడం హేయమైన నేరమని, అంత పెద్ద తప్పు చేసిన శరోన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు తిరువనంతపురం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే..
తిరువనంతపురానికి చెందిన శరోన్ రాజ్ (23) హత్య కేసులో అతడి ప్రియురాలు గ్రీష్మకు కేరళ కోర్టు సోమవారం (జనవరి 20న) మరణశిక్ష విధించింది. బీఎస్సీ రేడియాలజీ చివరి సంవత్సరం విద్యార్థి శరోన్ రాజ్, తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన గ్రీష్మ ఓ కాలేజీలో చదువుకునే సమమయంలో ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం ప్రేమగా మారి, దాదాపు ఏడాదిపాటు వీరు రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆర్మీలో పనిచేసే వ్యక్తితో 2022లో వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని ప్రియుడు శరోన్ రాజ్‌కు చెప్పి, అతడ్ని దూరం పెట్టడం ప్రారంభించింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శరోన్ రాజ్ ఆమె ప్రేమ తనకే దక్కాలని పదేపదే ఆమెకు చెప్పి చూశాడు. మరోవైపు పెళ్లికి సమయం దగ్గర పడుతుండటం, శరోన్ రాజ్ ఏమో తనను వదిలి పెట్టవద్దని గ్రీష్మతో చెబుతూనే ఉన్నాడు. 

ప్లాన్ ప్రకారం హత్య
ఎలాగైనా ప్రియుడ్ని వదిలించుకోవాలని చూసిన గ్రీష్మ ఏకంగా అతడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసింది. తన మామతో కలిసి ప్రియుడు శరోన్ రాజ్ హత్య చేయాలని భావించింది. అక్టోబర్ 14, 2022న కన్యాకుమారిలోని తన నివాసంలో గ్రీష్మ వద్దకు వెళ్లిన సమయంలో విషం కలిపిన జూస్ ఇవ్వగా శరోన్ రాజ్ తాగాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన అతడు కొన్నిరోజుల్లోనే చనిపోయాడు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గ్రీష్మ ఫ్యామిలీపై కేసు నమోదైంది. 

డీవైఎస్పీ జాన్సన్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు దర్యా్ప్తు చేపట్టింది. అక్టోబర్ 31, 2022న గ్రీష్మను అరెస్టు చేశారు. ఏడాది పాటు కస్టడీలో ఉన్న గ్రీష్మ, కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సెప్టెంబర్ 25, 2023న జైలు నుంచి విడుదలైంది. మరోవైపు దర్యాప్తులో గ్రీష్మ, ఆమె మామ కలిసి ఇదంతా చేసినట్లు పోలీసులు గుర్తించి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. విచారణ చేపట్టిన
నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జనవరి 17న ఇద్దరినీ దోషులుగా తేల్చారు. ఐపీసీ సెక్షన్లు 364, 328, 302 (హత్యకు శిక్ష), 201 సెక్షన్ల కింద కింద గ్రీష్మను దోషిగా తేల్చింది. తన స్వార్థం చూసుకునేందుకు ఓ వ్యక్తిని హత్య చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేసి పోలీసులను తప్పుదోవ పట్టించడం లాంటి విషయాలను కోర్టు తీవ్రంగా పరిగణించి తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్రీష్మ తల్లికి సంబంధం ఉందని బాధిత కుటుంబం ఆరోపించింది. కానీ అందుకు సాక్ష్యాలు లభ్యంకాకపోవడంతో ఆమెను నిర్దోషిగా కోర్టు తేల్చింది. 

Also Read: Free Mobile Fraud: ఆఫర్ కింద టెకీకి మొబైల్‌ గిఫ్ట్‌, సిమ్ వేయగా రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengaluru: ఫ్రెండ్స్‌తో సామూహిక శృంగారానికి ఒత్తిడి - భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త - కొందరి కష్టాలంతే!
ఫ్రెండ్స్‌తో సామూహిక శృంగారానికి ఒత్తిడి - భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త - కొందరి కష్టాలంతే!
Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget