అన్వేషించండి

Karimnagar: ప్రాణాలు తీసిన కోతి భయం, గుండెపోటుతో వ్యక్తి మృతి - భార్య గట్టిగా అరవడంతో !

భార్య కోతి కోతి అని అరవడంతో ఒక్కసారిగా నిద్రలేచిన వ్యక్తి కుమారుడిపై కోతి కూర్చొని ఉండడం చూసి టెన్షన్ పడ్డాడు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచిన ఘటన కరీంనగర్ పట్టణంలో జరిగింది.

కరీంనగర్ పట్టణంలో కోతి భయం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇంటి డోర్లు తెరిచి ఉంచడంతో లోనికి వచ్చిన ఓ కోతి కుమారుడిపై కూర్చుని ఉంది. భార్య కోతి కోతి అని అరవడంతో ఒక్కసారిగా నిద్రలేచిన వ్యక్తి కుమారుడిపై కోతి కూర్చొని ఉండడం చూసి టెన్షన్ పడ్డాడు. షాక్‌కు గురవడంతో కళ్లుతిరిగి పడిపోయారు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచారని తెలియడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  
కోతి కోతి అని అరిచిన భార్య..
కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో రుద్రోజు రాజు అనే వ్యక్తి తన కుటుంబంతో సహా నివసిస్తున్నారు. రాజుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల ప్రాంతంలో నల్లా వస్తుందని రాజు భార్య ఉదయాన్నే లేచి ఇంటి పని చూసుకుంటున్నారు. మరోవైపు తలుపులు తెరిచి ఉంచడంతో ఓ కోతి ఇంట్లోకి చొరబడింది. నేరుగా వెళ్లి రాజు కుమారునిపై కూర్చొని ఉంది అయితే ఇంటి పని చేసుకుంటున్న రాజు భార్య తిరిగి లోపలికి వచ్చి చూడగానే ఎదురుగా తన కుమారుడి పై కూర్చొని ఉన్న కోతి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కోతి కోతి అని గట్టిగా అరవడంతో ఆ అరుపులకు భర్తతోపాటు కుమారులు కూడా లేచారు. అయితే ఆకస్మికంగా లేచిన రాజు కోతిని చూసి ఒక్కసారిగా భయానికి గురై షాక్ లో ఉండిపోయాడు. కోతి అని గట్టిగా అరుస్తూనే వెనక్కి పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, ఇంటి చుట్టుపక్కల వారు కలిసి వెంటనే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సమయం మించిపోయిందని ఇంటి వద్ద గుండెపోటు రావడంతో రాజు ప్రాణాలు విడిచాడని డాక్టర్లు ధ్రువీకరించినట్లు సమాచారం. 

ఉపాధి కోసం కరీంనగర్‌కు వలస.. 
ఇంటి పెద్ద ఆకస్మికంగా మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరంగల్ కి చెందిన రాజు ఉపాధి నిమిత్తం కరీంనగర్ కి వచ్చి సెటిల్ అయ్యారు మెకానిక్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జరిగిన సంఘటనపై హనుమాన్ నగర్ కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కోతుల బెడద నుండి రక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దీంతో ఏకంగా ఓ ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహిస్తున్నారు.

పట్టణంలో కోతుల దండు
విస్తీర్ణం పరంగా కరీంనగర్ పట్టణం చాలా తక్కువ వైశాల్యంతో ఉంటుంది. చుట్టుపక్కల గతంలో పచ్చని చెట్లు ఎత్తైన గుట్టలతో ఉండే ఈ నగరానికి గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణ సమస్యలు మొదలైంది. పట్టణం చుట్టూ దాదాపుగా 30 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉన్న గుట్టలన్ని గ్రానైట్ డిమాండ్ కారణంగా మాయమయ్యాయి. ఇక్కడ రాయికి ఉన్న ప్రపంచవ్యాప్త డిమాండ్ కోతులు ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి జీవాలకు ఆవాసాలైనా గుట్టలు, అడవులు లేకుండా చేసింది. దీంతో అవి తరచూ ఆహారం కోసం పట్టణం పోయి పడటం సర్వసాధారణంగా మారింది. గుంపులు గుంపులుగా వచ్చి పలువురు పై దాడి చేయడం వల్ల అనేకసార్లు ప్రజలు గాయాలపాలయ్యారు. ఇక శాతవాహన యూనివర్సిటీలో హల్చల్ చేసిన ఎలుగుబంటి ఇప్పటికి దొరకలేదు. ఇలా పర్యావరణ విధ్వంసం కారణంగా అడవుల్లో ఉండాల్సిన జీవాలు నగరంలోకి వస్తున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget