అన్వేషించండి

Konaseema Crime News: కోన‌సీమ‌లో ఘరానా దొంగ అరెస్ట్‌ - దేవాలయాలే టార్గెట్, తాళాలు వేసిన ఇళ్లులంటే మరీ ఇంట్రెస్ట్

ఊరుచివర ఉండే దేవాలయాలు, తాళాలు వేసుకుని వెళ్లిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని రూ.47,18,300 విలువైన 622 గ్రాముల బంగారాన్ని, 14 కేజీల 90 గ్రాముల వెండిని కొల్లగొట్టాడు. ఈ ఘరానా దొంగ చివరకు కటకటాల పాలయ్యాడు..

కోన‌సీమ‌లో ఘరానా దొంగ అరెస్ట్‌..
 
రూ.47.18లక్షల విలువ గల బంగారం, వెండి స్వాదీనం..
 
ఉమ్మడి ఉభయగోదావరి 23 జిల్లాల్లో వరుస‌ దొంగతనాలు..
 
దేవాలయాలే టార్గెట్‌.. తాళాలేసిన ఇళ్లంటే మరీ ఇంట్రస్ట్‌.. ఎంతటి సెక్యూరిటీ ఉన్నా సరే అతగాడికి అవేమీ అడ్డురావు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ సారి దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చాడు.. మరింత రాటుదేరాడు. ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైనా దృష్టిపెట్టాడు.. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వరుస దొంగతనాలకు తెరతీశాడు.. ఊరుచివర ఉండే దేవాలయాలు, తాళాలు వేసుకుని బయటకు వెళ్లిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని ఏకంగా రూ.47,18,300 విలువైన 622 గ్రాముల బంగారాన్ని, 14 కేజీల 90 గ్రాముల వెండిని కొల్లగొట్టాడు.
పగలు దర్జాగా తిరుగుతూ రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పట్టుకుని కటకటాల వెనక్కు పంపారు డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసులు... పాలకొల్లు రూరల్‌ మండలం పూలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న కట్టా సుబ్బారావు అనే ఘరానా దొంగను పట్టుకుని రిమాండ్‌కు పంపారు. ఈ కేసుకు సంబందించి వివరాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ అడిష‌న‌ల్ ఎస్పీ ల‌తా మాధురితో క‌ల‌సి వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. 
 
చెడు వ్యసనాలకు అలవాటు పడి... 
నిందితుడు కట్టా సుబ్బారావు చెడు వ్యసనాలకు అలవాటుపడి దేవాలయాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని తాళాలు పగులకొట్టి బీరువాల్లో ఉన్న బంగారు, వెండి వస్తువులను  అపహరిస్తుంటాడని ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ దొంగతనాల ద్వారా అపహరించిన బంగారు వెండి వస్తువులను విక్రయించి వీటి ద్వారా వచ్చిన సొమ్ముతో చెడు వ్యసనాలకు వినియోగిస్తుంటాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడి ఓసారి జైలుకు కూడా వెళ్లాడన్నారు.
 
7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 కేసులు..
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు కట్టా సుబ్బారావు దొంగతనాల్లో బాగా ఆరితేరాడని ఎస్పీ తెలిపారు. ఈక్రమంలో మలికిపురం, సఖినేటిపల్లి, వీరవాసరం, పాలకొల్లు రూరల్‌, పాలకొల్లు టౌన్‌, పాలకోడేరు, యలమంచిలి ఇలా ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సదరు నిందితుడు కట్టా సుబ్బారావుపై 23 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. శనివారం దిండి పరిసర ప్రాంతంలోని 216 జాతీయ రహదారి వద్ద మలికిపురం మార్కిటింగ్‌ యార్డ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద తచ్చాడు తుండగా అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిందితుని వద్దనుంచి రూ.37,32,000 విలువగల 622 గ్రాముల బంగారాన్ని, రూ.09,86,300 విలువచేసే 14.90 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  ఈ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడ్ని  చాకచక్యంగా పట్టుకునేందుకు కృషి చేసిన కొత్తపేట ఎస్డీపీవో కె.వెంకటరమణ, అమలాపురం క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.గోవిందరాజు, మలికిపురం ఎస్సై జి.సురేంద్రబాబు, సిబ్బంది, సఖినేటిపల్లి ఎస్సై ఎస్‌.రాము, సిబ్బందిని, అమలాపురం క్రైం ఏఎస్సై బాలకృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget