అన్వేషించండి

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Kadapa News : కడపలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంటి యజమానులు నగరపాలక, సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు.

Kadapa News : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా కడపలో అక్రమ నిర్మాణాలు తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన నగరపాలక, సచివాలయ సిబ్బందిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.  రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు నగరపాలక, సచివాలయ సిబ్బంది యత్నించారు. క్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇంటి గోడను కూల్చేందుకు సచివాలయ సిబ్బంది ప్రొక్లైనర్ తో అక్కడికి వచ్చారు. గోడ కూల్చివేతపై న్యాయస్థానంలో స్టే ఉందని క్రాంతి కుమార్ సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే సిబ్బంది ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నించడంతో క్రాంతికుమార్, అతడి అనుచరులు సచివాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా కూల్చేందుకు ప్రయత్నించారని ఇంటి యజమాని ఆరోపించారు.  

కడపలో ఉద్రిక్తత 

కడపలోని అక్రమ ఇళ్ల నిర్మాణం కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవుని కడపకు వెళ్లే రోడ్డులో బుక్కాయిపల్లి వద్ద ఓ ఇంటిని అక్రమంగా నిర్మించారని రెవెన్యూ సచివాలయ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించింది. అయితే కూల్చివేతను ఇంటి యజమానులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిపై సచివాలయ సిబ్బంది టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కడప నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవచన్​ ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

నగరపాలక కమిషనర్ ఎంట్రీతో 

బుక్కాయిపల్లిలో అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటి వద్దకు చేరుకున్న నగరపాలక సంస్థ కమిషనర్  జేసీబీతో కూల్చి వేయించారు. తహశీల్దార్​ శివరామరెడ్డి కూడా ఘటనాస్థలిని పరిశీలించారు.  అక్రమనిర్మాణంగా తేల్చిన ప్రాంతాన్ని మొత్తం అధికారులు జేసీబీతో కూల్చివేశారు.  ఇంటిని కూడా కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించగా ఇంటి యజమానులు వేడుకోవడంతో రాత్రి వరకు సమయం ఇచ్చారు. శుక్రవారం ఉదయంలోపు ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంటిని మొత్తం కూల్చివేస్తామని కమిషనర్ సూర్య సాయి ప్రవచన్ హెచ్చరించారు. తమ సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

టీ షాపు యజమానిపై దాడి

నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావలిలో రోడ్డు పక్కన టీ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కావలి స్థానికులు ఇద్దరు తీవ్రంగా దాడి చేశారు. టీ బంకులో రచ్చ రచ్చ చేశారు. అతడిని బూతులు తిడుతూ చేత్తే, కాలుతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. 

అసలేం జరిగింది?

కావలి రహదారి పక్కనే ఉన్న టీ షాపు ముందు బైక్ లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆగారు. బైక్ దిగకుండానే టీ, సిగరెట్ తమ దగ్గరకు తెచ్చివ్వాలని అడిగారు. దీనికి టీ షాపు యజమాని అభ్యంతరం తెలిపాడు. లోపలకు వచ్చి తాగాలని, దగ్గరకు తెచ్చివ్వడం కుదరదని అన్నాడు. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తులిద్దరూ దిగి టీ షాపులోకి వచ్చారు. టీ, సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వనంటావా అంటూ తీవ్రంగా కొట్టారు. మా స్థాయి ఏంటి, మా సంగతేంటి అంటూ బూతులు తిట్టారు. 

పాపం.. దెబ్బలు తిన్న టీ షాపు యజమాని

వారిద్దరూ అంత తీవ్రంగా కొడుతున్నా కూడా టీ షాపు యజమాని నోరు మెదపకపోవడం విశేషం. స్థానికుడు కాకపోవడంతో అతను సైలెంట్ గా ఉన్నాడు. మధ్యలో చాలామంది ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూశారు. కానీ వారు వినలేదు. టీ బంకు యజమాన్ని దాదాపు పది నిముషాలసేపు కొడుతూనే ఉన్నారు. పాపం పిల్లలు కలవాడు వదిలేయండి అంటూ చుట్టుపక్కలవాళ్లు చెబుతున్నా కూడా మరింతగా రెచ్చిపోయి మరీకొట్టారు.

Also Read : Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

Also Read : రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget