అన్వేషించండి

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Kadapa News : కడపలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంటి యజమానులు నగరపాలక, సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు.

Kadapa News : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా కడపలో అక్రమ నిర్మాణాలు తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన నగరపాలక, సచివాలయ సిబ్బందిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.  రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు నగరపాలక, సచివాలయ సిబ్బంది యత్నించారు. క్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇంటి గోడను కూల్చేందుకు సచివాలయ సిబ్బంది ప్రొక్లైనర్ తో అక్కడికి వచ్చారు. గోడ కూల్చివేతపై న్యాయస్థానంలో స్టే ఉందని క్రాంతి కుమార్ సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే సిబ్బంది ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నించడంతో క్రాంతికుమార్, అతడి అనుచరులు సచివాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా కూల్చేందుకు ప్రయత్నించారని ఇంటి యజమాని ఆరోపించారు.  

కడపలో ఉద్రిక్తత 

కడపలోని అక్రమ ఇళ్ల నిర్మాణం కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవుని కడపకు వెళ్లే రోడ్డులో బుక్కాయిపల్లి వద్ద ఓ ఇంటిని అక్రమంగా నిర్మించారని రెవెన్యూ సచివాలయ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించింది. అయితే కూల్చివేతను ఇంటి యజమానులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిపై సచివాలయ సిబ్బంది టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కడప నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవచన్​ ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

నగరపాలక కమిషనర్ ఎంట్రీతో 

బుక్కాయిపల్లిలో అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటి వద్దకు చేరుకున్న నగరపాలక సంస్థ కమిషనర్  జేసీబీతో కూల్చి వేయించారు. తహశీల్దార్​ శివరామరెడ్డి కూడా ఘటనాస్థలిని పరిశీలించారు.  అక్రమనిర్మాణంగా తేల్చిన ప్రాంతాన్ని మొత్తం అధికారులు జేసీబీతో కూల్చివేశారు.  ఇంటిని కూడా కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించగా ఇంటి యజమానులు వేడుకోవడంతో రాత్రి వరకు సమయం ఇచ్చారు. శుక్రవారం ఉదయంలోపు ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంటిని మొత్తం కూల్చివేస్తామని కమిషనర్ సూర్య సాయి ప్రవచన్ హెచ్చరించారు. తమ సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

టీ షాపు యజమానిపై దాడి

నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావలిలో రోడ్డు పక్కన టీ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కావలి స్థానికులు ఇద్దరు తీవ్రంగా దాడి చేశారు. టీ బంకులో రచ్చ రచ్చ చేశారు. అతడిని బూతులు తిడుతూ చేత్తే, కాలుతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. 

అసలేం జరిగింది?

కావలి రహదారి పక్కనే ఉన్న టీ షాపు ముందు బైక్ లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆగారు. బైక్ దిగకుండానే టీ, సిగరెట్ తమ దగ్గరకు తెచ్చివ్వాలని అడిగారు. దీనికి టీ షాపు యజమాని అభ్యంతరం తెలిపాడు. లోపలకు వచ్చి తాగాలని, దగ్గరకు తెచ్చివ్వడం కుదరదని అన్నాడు. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తులిద్దరూ దిగి టీ షాపులోకి వచ్చారు. టీ, సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వనంటావా అంటూ తీవ్రంగా కొట్టారు. మా స్థాయి ఏంటి, మా సంగతేంటి అంటూ బూతులు తిట్టారు. 

పాపం.. దెబ్బలు తిన్న టీ షాపు యజమాని

వారిద్దరూ అంత తీవ్రంగా కొడుతున్నా కూడా టీ షాపు యజమాని నోరు మెదపకపోవడం విశేషం. స్థానికుడు కాకపోవడంతో అతను సైలెంట్ గా ఉన్నాడు. మధ్యలో చాలామంది ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూశారు. కానీ వారు వినలేదు. టీ బంకు యజమాన్ని దాదాపు పది నిముషాలసేపు కొడుతూనే ఉన్నారు. పాపం పిల్లలు కలవాడు వదిలేయండి అంటూ చుట్టుపక్కలవాళ్లు చెబుతున్నా కూడా మరింతగా రెచ్చిపోయి మరీకొట్టారు.

Also Read : Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!

Also Read : రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget