అన్వేషించండి

Rajahmundry: రూ. 550 కోట్ల కుంభకోణం - రాజమండ్రి సెంట్రల్ జైలుకు జయలక్ష్మి బ్యాంకు నిందితులు

ది జయలక్ష్మి కో ఆపరేటివ్ సహకార బ్యాంకు పేరుతో రూ. 550 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Jayalakshmi Cooperative Scam in Kakinda: కాకినాడ జిల్లాలో సుమారు రూ.550 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ రాయవరపు విశాలక్ష్మి, బ్యాంకు ఎండీగా వ్యవహరిస్తున్న ఆమె భర్త రాయవరపు సీతారామాంజనేయులు, బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న జయదేవ్ మణిలను అరెస్ట్ చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు అక్కడి నుంచి మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు తన ఖాతాదారులనుంచి కోట్ల రూపాయలు మేర వసూళ్లు చేసి ఆపై బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వీరు ముగ్గురు ఏ1, ఏ2, ఏ3 గా ఉన్నారు. బ్యాంకు నిధులను ఎటువంటి గ్యారంటీలు లేకుండా ఇష్టానుసారంగా దారి మళ్లించారు అన్న అభియోగంపై పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదయ్యాయి. బాధితులు చాలా కాలం నుంచి ఆందోళనలు చేస్తుండగా దీనిపై సహకార సంఘ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవాలు వెల్లడవంతో ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ, అమలాపురంలో ఆందోళనలు...
ది జయలక్ష్మి కో ఆపరేటివ్ సహకార బ్యాంకు పేరుతో కాకినాడ కేంద్రంగా కాకినాడ అమలాపురం, రాజమండ్రి ప్రాంతాలలో బ్యాంకుల నిర్వహణ ద్వారా కోట్లాది రూపాయలు డిపాజిట్లు రూపంలో సేకరించారు. ఖాతాదారులను నమ్మబలికి అధిక వడ్డీలు ఎరచూపి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. 5 ఏళ్ల కాలానికి ఖాతాదారుల చెల్లించిన మొత్తం నగదు రెట్టింపు చేసి ఇస్తామని చెప్పారు. పలుమార్లు బ్యాంకుల ముందు ధర్నాల నిర్వహించిన ఖాతాదారులు కాకినాడ జిల్లా ఎస్పీకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. కష్టపడి సంపాదించిన సొమ్ములు ఇలా బోగస్ బ్యాంకుల్లో జమచేసి మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న నిందితులను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఏసీబీ వలలో చిక్కిన జగ్గంపేట డిప్యూటీ తహసీల్దార్
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండల డిప్యూటీ తహసీల్దార్. టేకు చెట్లు నరకడం కోసం ఎన్వోసీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఓ రైతు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ను సంప్రదించారు. అయితే సర్టిఫికెట్ ఇవ్వాలంటే చెట్టుకు రూ.300 చొప్పున మొత్తం రూ.16,000 డిమాండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్. దీని కోసం ముందస్తుగా రూ.3,000 తీసుకోగా మిగిలిన సొమ్ముకోసం పదే పదే ఒత్తిడి చేయసాగాడు. దీంతో రైతు డయల్ 14400 ద్వారా ఏసీబీ అధికారులను అశ్రయించాడు. రైతు ఇచ్చిన సమాచారం మేరకు మందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రైతు వద్ద నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా డిప్యూటీ ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారని ఏసీబీ అడిషనల్ ఏప్పీ సౌజన్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సౌజన్య వెల్లడించారు. ఈదాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, శ్రీనివాస్, డి. వాసుకృష్ణ పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget