అన్వేషించండి

Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!

ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం  ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 

జగిత్యాల జిల్లాలో ఓ తండ్రి అత్యంత అమానవీయ రీతిలో తన కన్న కూతుర్లను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని నర్సింగాపూర్‌లో జలపతి రెడ్డి అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి తాను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం  ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 

పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన చిన్నారుల్లో మధుమిత అనే బాలిక 5వ తరగతి చదువుతుంటే, ప్రణిత్య అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. జలపతి రెడ్డికి చెందిన భూమిని ప్రజా అవసరాల కోసం తీసుకున్న ప్రభుత్వం.. పరిహారాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసింది. ఆ డబ్బులు చేతికి రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా తనకున్న కొంత వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేసి, మిగతా కొంత డబ్బులను ఊళ్లో, జగిత్యాలకు చెందిన కొంతమందికి అప్పుగా ఇచ్చారు. వారెవరూ తిరిగి చెల్లించడం లేదని, ఎగవేశారని తెలుస్తోంది. పిల్లలు ఎదుగుతుండటం, అవసరాలు పెరిగిపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

ఈ క్రమంలో మానసిక ఇబ్బందులకు గురైన జలపతి రెడ్డి గత నెలలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సూసైడ్‌ నోట్‌ రాసి దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని తన భార్యకు కూడా ఫోన్‌లో పంపించినట్లుగా గ్రామస్థులు ఈ విషయాన్ని చెప్పారు. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటానని తరచూ చెప్తూ ఉండడంతో కుటుంబసభ్యులు మొదట్లో పట్టించుకున్నా, తర్వాత తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు కుమార్తెలను తీసుకుని స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది.

ఆ శుభకార్యానికి పెద్ద కూతురు వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. శనివారం (ఫిబ్రవరి 4) ఉదయం జలపతి రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత హత్యగా భావించారు. ఆ తర్వాత బావిలో చిన్నారుల మృతదేహాలు కూడా కనిపించాయి. వారిని కూడా బయటకు తీయడంతో కుమార్తెలను బావిలో తోసేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనపై మొదట భార్య అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లాయర్ వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పిల్లలను బావిలో తోశాడని చెప్పింది. ఈ ఫిర్యాదు, మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఫోన్ రికార్డింగులు, ఆయనతో గతంలో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget