News
News
X

Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!

ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం  ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 

FOLLOW US: 
Share:

జగిత్యాల జిల్లాలో ఓ తండ్రి అత్యంత అమానవీయ రీతిలో తన కన్న కూతుర్లను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని నర్సింగాపూర్‌లో జలపతి రెడ్డి అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి తాను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం  ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 

పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన చిన్నారుల్లో మధుమిత అనే బాలిక 5వ తరగతి చదువుతుంటే, ప్రణిత్య అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. జలపతి రెడ్డికి చెందిన భూమిని ప్రజా అవసరాల కోసం తీసుకున్న ప్రభుత్వం.. పరిహారాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసింది. ఆ డబ్బులు చేతికి రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా తనకున్న కొంత వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేసి, మిగతా కొంత డబ్బులను ఊళ్లో, జగిత్యాలకు చెందిన కొంతమందికి అప్పుగా ఇచ్చారు. వారెవరూ తిరిగి చెల్లించడం లేదని, ఎగవేశారని తెలుస్తోంది. పిల్లలు ఎదుగుతుండటం, అవసరాలు పెరిగిపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

ఈ క్రమంలో మానసిక ఇబ్బందులకు గురైన జలపతి రెడ్డి గత నెలలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సూసైడ్‌ నోట్‌ రాసి దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని తన భార్యకు కూడా ఫోన్‌లో పంపించినట్లుగా గ్రామస్థులు ఈ విషయాన్ని చెప్పారు. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటానని తరచూ చెప్తూ ఉండడంతో కుటుంబసభ్యులు మొదట్లో పట్టించుకున్నా, తర్వాత తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు కుమార్తెలను తీసుకుని స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది.

ఆ శుభకార్యానికి పెద్ద కూతురు వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. శనివారం (ఫిబ్రవరి 4) ఉదయం జలపతి రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత హత్యగా భావించారు. ఆ తర్వాత బావిలో చిన్నారుల మృతదేహాలు కూడా కనిపించాయి. వారిని కూడా బయటకు తీయడంతో కుమార్తెలను బావిలో తోసేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనపై మొదట భార్య అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లాయర్ వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పిల్లలను బావిలో తోశాడని చెప్పింది. ఈ ఫిర్యాదు, మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఫోన్ రికార్డింగులు, ఆయనతో గతంలో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు.

Published at : 05 Feb 2023 09:53 AM (IST) Tags: Jagityal news Man Suicide daughters murder Narsingapur Jagityal daughters news

సంబంధిత కథనాలు

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి