By: ABP Desam | Updated at : 23 Mar 2022 06:12 PM (IST)
Edited By: Murali Krishna
చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి- దర్యాప్తునకు ఆదేశించిన సీఎం
విషపూరిత చాక్లెట్లు తిని నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ప్రదేశ్లోని ఖుషీ నగర్ జిల్లాలో బుధవారం ఈ విషాదకర సంఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారుల్లో ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు.
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने कुशीनगर में हुई दुर्भाग्यपूर्ण घटना में बच्चों की मृत्यु पर गहरा शोक व्यक्त करते हुए शोक संतप्त परिजनों के प्रति अपनी संवेदनाएं व्यक्त की हैं।
— Yogi Adityanath Office (@myogioffice) March 23, 2022
महाराज जी ने पीड़ित परिवारों को तत्काल सहायता तथा दुर्घटना की जांच हेतु निर्देश दिए हैं।
ఎలా జరిగింది?
ఖుషీ నగర్ జిల్లాలోని కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పొరిగింట్లో ఉంటోన్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు.
ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతి చెందిన చిన్నారుల్లో మంజన (5), స్వీటీ (3), సమర్ (2) తోబుట్టువులు. వీరితోపాటు అరుణ్ (5) కూడా చనిపోయాడు. ఖుషీ నగర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వరుణ్ కుమార్ పాండే ఈ వివరాలు తెలిపారు. మిగిలిన చాక్లెట్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం భద్రపరిచినట్లు కలెక్టర్ వెల్లడించారు.
దర్యాప్తు
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు తెలిపారు.
Also Read: Corona Lockdown in US: అమెరికాలో మళ్లీ లాక్డౌన్- ఆ వేరియంట్తో ముప్పు తప్పదా?
Also Read: AAP Delhi : డ్రైనేజీ క్లీన్ చేశాడని పాలాభిషేకం - ఢిల్లీలో ఆప్ కౌన్సిలర్ తీరు వైరల్
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Hyderabad: వంట మాస్టర్తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే
Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్