అన్వేషించండి

Hyderabad News: ఉద్యోగం పేరుతో మహిళకు కుచ్చు- పదకొండు లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Hyderabad News: ఉద్యోగం పేరుతో మహిళను మోసం చేసిన నేరగాళ్లు. ఏకంగా రూ.11.50 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.

Hyderabad News: ఉద్యోగాల పేరుతో మోసం, జాబ్ ఇప్పిస్తామని లక్షలు కాజేసిన సంస్థ.. ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఎన్ని వార్తలు వచ్చినా, వస్తున్నా.. కొంతమందిలో మార్పు రావడం లేదు. పోలీసులు, నిపుణులు అలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని, ట్రైనింగ్ కు ఎవరూ డబ్బులు తీసుకోరని చెబుతున్నా వారి మాటలు వినడం లేదు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ 11 లక్షల రూపాయలు మోసపోయింది.

సెక్యూరిటీ డిపాజిట్ కోసమంటూ..

హైదరాబాద్ కి చెందిన 45 ఏళ్ల మహిళకు ఉద్యోగం పేరుతో టెలిగ్రామ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన ఆ మహిళకు వారి నుంచి ఫోన్ వచ్చింది. క్రిటికల్ థింకర్స్ కావాలని వారు చెప్పారు. మార్కెట్ లో విడుదల అవుతున్న ప్రాజెక్టుకి క్రిటికల్ థింకింగ్ అనలిటిక్స్ ద్వారా తాము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో ఎలా రిలీజ్ చేయాలన్నదానిపై ఉద్యోగం ఉంటుందని చెప్పారు.

అదంతా నిజమేనని నమ్మింది ఆ మహిళ. తనకు సరైన ఉద్యోగం వచ్చిందనుకుంది. ఆ మహిళ జాబ్ ఆఫర్ కి సరే అని చెప్పింది. తదుపరి ప్రొసీడింగ్స్ లో ట్రైనింగ్, సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 10వేలు డబ్బు కట్టాలని ఆ మహిళకు చెప్పారు. తను చెల్లించిన డబ్బంతా కూడా రిఫండ్ అవుతుందని నమ్మించారు. అలా విడతల వారీగా ట్రైనింగ్ అనే పేరుతో డబ్బు కట్టించుకున్నారు. అలా మొత్తం రూ. 11.50 లక్షలు ఆ మహిళకు కుచ్చు టోపి పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన నెట్ వర్కింగ్ ప్రాసెస్ మూసేయడంతో తను మోసపోయినట్టు ఆ మహిళ గ్రహించింది. పోలీసులు ఆశ్రయించింది.

ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మోసాల నేపథ్యంలో ఉద్యోగాల పేరిట వస్తున్న ఇటువంటి మెసేజీలను, మెయిల్ లను గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సంస్థలేవీ ట్రైనింగ్ ఇచ్చినందుకు డబ్బులు తీసుకోవని, డబ్బు కట్టాలని అడిగితే అది కచ్చితంగా ఫ్రాడ్ అని గుర్తించాలని వారు చెబుతున్నారు. జాబ్ ఆఫర్ అంటూ మెసేజ్, కాల్, మెయిల్ రాగానే ముందుగా ఆ కంపెనీకి సంబంధించిన పోర్టల్స్ ను చూడాలని, వాటి చిరునామా, ఫోన్ల నంబర్లు సేకరించి కాల్ చేసి కనుక్కోవాలని.. అంతా సరిగ్గా ఉంటేనే అప్పుడు ముందుకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. 

ఇలాంటి మోసాల్లో బాధితులుగా 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. మోసపోయిన తర్వాత డబ్బు రావడం చాలా కష్టం కాబట్టి.. ముందే అప్రమత్తంగా ఉండాలని వారు అంటున్నారు. మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత బాధితులదేనని వారు చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి వాటిల్లో మనకు తెలియకుండా మోసపోతే.. ఆ విషయాన్ని వీలైనంత త్వరగా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. నిజమైన సంస్థలేవి మన నుండి ఏ విధంగానూ డబ్బులు సేకరించవని ముందుగా ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన విషయమని వారు చెబుతున్నారు. అలాగే జాబ్ ఆఫర్ అంటూ వచ్చిన మెయిల్స్ లోని లింకులను తొందరపడి క్లిక్ చేయవద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మన కంప్యూటర్ లోకి వైరస్ చొరబడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Eluru News: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం
Air Quality Index: బెల్లంపల్లిలో క్షీణిస్తున్న గాలి నాణ్యత, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటే ?
తెలంగాణలో బెల్లంపల్లి సహా ఈ ప్రాంతాల గాలి నాణ్యతపై ఆందోళన! ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే ?
Shankar: రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Eluru News: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురి మృతి- ఓ బాలుడి పరిస్థితి విషమం
Air Quality Index: బెల్లంపల్లిలో క్షీణిస్తున్న గాలి నాణ్యత, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటే ?
తెలంగాణలో బెల్లంపల్లి సహా ఈ ప్రాంతాల గాలి నాణ్యతపై ఆందోళన! ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే ?
Shankar: రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
SJ Suryah - Pawan Kalyan: పవన్‌ను సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య
పవన్‌ను సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య
Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు
ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Hyderabad Drugs Case: నగరంలో మరో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు- సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు అరెస్ట్
నగరంలో మరో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు- సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు అరెస్ట్
Embed widget