అన్వేషించండి

Rangareddy News : రాజేంద్రనగర్ లో విషాదం, ఉరివేసుకుని నవ వధువు ఆత్మహత్య!

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది.

Rangareddy News : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో విషాదం జరిగింది. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బయటకు వెళ్లిన భర్త  ఇంటికి వచ్చే లోపు తనువు చాలించింది. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని భార్య ఆత్మహత్యకు పాల్పడిందని భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 8 నెలల క్రితం అత్తాపూర్ కు చెందిన కిరణ్ కుమార్ తో పుష్పాంజలి వివాహం జరిగింది. 

విషాదాంతమైన ప్రేమ కథ 

కుటుంబ పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కలిసి జీవించే అవకాశం లేదని కలిసి మరణించాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన ప్రేమ జంట అనిత, మణికుమార్‌ కర్ణాటకలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కందనాతి గ్రామానికి చెందిన కేశవ్‌ కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా కృష్ణా మండలం చేగుంటకు వలస వచ్చారు. కొంతకాలంగా వారి దగ్గరే ఉంటున్న కేశవ్‌ చిన్నమ్మ కుమారుడు మణికుమార్‌ కూడా వారితో పాటు వలస వెళ్లాడు. కేశవ్‌ కూతురు అనిత, మణికుమార్‌ మధ్య ప్రేమ చిగురించింది. వరుసలు కలువవని వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన మణికుమార్‌, అనిత  కృష్ణా మండలం చేగుంట రైల్వే స్టేషన్‌ సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో రైలు కిందపడి సూసైండ్ చేసుకున్నారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి, బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా విలపించారు. మృతదేహాలను వారి సొంత గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 దంపతుల ఆత్మహత్య
 
కడప జిల్లా మైలవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు మైలవరం జలాశయంలో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని మైలవరం కట్టమీద వదిలిపెట్టి జలాశయంలో దూకినట్టు స్థానికులు తెలిపారు. మృతులు దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గోవర్ధన్ అని పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు  బంధువులు చెబుతున్నారు. లక్ష్మీదేవి మృతదేహం దొరకగా గోవర్ధన్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులకు ఒక పాప, బాబు ఉన్నట్లు తెలుస్తోంది. 

జడ్పీటీసీ దారుణ హత్య

సిద్దిపేట జిల్లాలో ఓ జడ్పీటీసీ మెంబర్ దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన సందర్భంలో ఆయనపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ ఘటన చేర్యాల మండలం గుర్జకుంటలో జరిగింది. చేర్యాల జెడ్పీటీసీ మెంబర్ అయిన శెట్టె మల్లేశం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం (డిసెంబర్ 26) ఉదయం దాడికి పాల్పడ్డారు. వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో బాధితుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఆయన్ని స్థానికులు మొదట సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే మల్లేశం మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
AP SSC Exam Results 2026: రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Gayatri Gupta: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
EPFO Updates:పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
Tamil Nadu Bengal Trends: తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
West Bengal Elections 2026:నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
CM Revanth Reddy: గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
Embed widget