అన్వేషించండి

Rangareddy News : రాజేంద్రనగర్ లో విషాదం, ఉరివేసుకుని నవ వధువు ఆత్మహత్య!

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది.

Rangareddy News : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో విషాదం జరిగింది. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బయటకు వెళ్లిన భర్త  ఇంటికి వచ్చే లోపు తనువు చాలించింది. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని భార్య ఆత్మహత్యకు పాల్పడిందని భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 8 నెలల క్రితం అత్తాపూర్ కు చెందిన కిరణ్ కుమార్ తో పుష్పాంజలి వివాహం జరిగింది. 

విషాదాంతమైన ప్రేమ కథ 

కుటుంబ పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కలిసి జీవించే అవకాశం లేదని కలిసి మరణించాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన ప్రేమ జంట అనిత, మణికుమార్‌ కర్ణాటకలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కందనాతి గ్రామానికి చెందిన కేశవ్‌ కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా కృష్ణా మండలం చేగుంటకు వలస వచ్చారు. కొంతకాలంగా వారి దగ్గరే ఉంటున్న కేశవ్‌ చిన్నమ్మ కుమారుడు మణికుమార్‌ కూడా వారితో పాటు వలస వెళ్లాడు. కేశవ్‌ కూతురు అనిత, మణికుమార్‌ మధ్య ప్రేమ చిగురించింది. వరుసలు కలువవని వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన మణికుమార్‌, అనిత  కృష్ణా మండలం చేగుంట రైల్వే స్టేషన్‌ సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో రైలు కిందపడి సూసైండ్ చేసుకున్నారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి, బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా విలపించారు. మృతదేహాలను వారి సొంత గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 దంపతుల ఆత్మహత్య
 
కడప జిల్లా మైలవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు మైలవరం జలాశయంలో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని మైలవరం కట్టమీద వదిలిపెట్టి జలాశయంలో దూకినట్టు స్థానికులు తెలిపారు. మృతులు దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గోవర్ధన్ అని పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు  బంధువులు చెబుతున్నారు. లక్ష్మీదేవి మృతదేహం దొరకగా గోవర్ధన్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులకు ఒక పాప, బాబు ఉన్నట్లు తెలుస్తోంది. 

జడ్పీటీసీ దారుణ హత్య

సిద్దిపేట జిల్లాలో ఓ జడ్పీటీసీ మెంబర్ దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన సందర్భంలో ఆయనపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ ఘటన చేర్యాల మండలం గుర్జకుంటలో జరిగింది. చేర్యాల జెడ్పీటీసీ మెంబర్ అయిన శెట్టె మల్లేశం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం (డిసెంబర్ 26) ఉదయం దాడికి పాల్పడ్డారు. వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో బాధితుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఆయన్ని స్థానికులు మొదట సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే మల్లేశం మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget