అన్వేషించండి

Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!

Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Finger Print Surgery Scam :  ఇటీవల వచ్చిన ఓ సినిమాలో మృతదేహాల ఫింగర్ ప్రింట్స్ క్రిమినల్ గ్యాంగ్స్ అమ్ముతుంటారు. అయితే భాగ్యనగరంలో ఇలాంటి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్స్ సర్జరీ చేస్తున్నారు. ఈ ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఫింగర్ ప్రింట్స్ ముఠా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలిముద్రలు పడడం తప్పనిసరి. ఫింగర్ ప్రింట్ ఒక్కసారి రిజక్ట్ అయితే ఆ దేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. అయితే ఇలా వేలిముద్రలు రిజెక్ట్ అయిన యువకులు సర్జరీలు చేయించుకుని మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా సర్జరీ చేయించుకున్న వేలిముద్రలు సంవత్సరం పాటు ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్జరీ చేయించుకుని దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువకులకు ఫింగర్ ప్రింట్స్ సర్జరీ చేస్తున్న వైద్యుడితో పాటు కొంత మంది సిబ్బందిని పోలీసులు అరెస్టుచేశారు. 

సర్జరీలతో ఫింగర్ ప్రింట్స్ మార్పు

హైదరాబాద్ నగరంలో వేలిముద్రలతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు పంపేందుకు శస్త్ర చికిత్స ద్వారా యువకుల వేలిముద్రలు మార్చేస్తున్న ముఠా గుట్టురట్టుచేశారు రాచకొండ పోలీసులు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు సహా,  కొద్ది మందిని పోలీసులు అరెస్టు చేశారు. యువతను గల్ఫ్‌కు పంపడంలో ఏజెంట్ల పాత్ర, ఎంత మంది ఆ విధంగా రాష్ట్రం విడిచివెళ్లారు అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతకుముందు పాలిమర్‌ను ఉపయోగించి వేలిముద్రలను క్లోనింగ్ చేసే ముఠాను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. అయితే సర్జరీ చేసి వేలిముద్రలను మార్చే గ్యాంగ్ పోలీసులకు షాక్ ఇచ్చింది. 

Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!

గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు  

ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా వేలిముద్రలు తీసుకోవాలి. వాటిని రిజెక్ట్ చేస్తే అక్కడికి వెళ్లే అవకాశం కోల్పోతారు. అయినప్పటికీ ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు వివిధ మార్గాలను వెతకడానికి ప్రయత్నిస్తారు. దీన్ని క్యాష్ చేసుకోడానికి ఓ ముఠా సహజమైన వేలిముద్రను శస్త్రచికిత్సా విధానం ద్వారా కవర్ చేయడానికి ప్రయత్నించింది. ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ఒక సంవత్సరం పాటు ఉంటాయని, వాటి ద్వారా విదేశాలకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఫింగర్ ప్రింట్స్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. A1 నాగమహేశ్వర్ రెడ్డి, A2 వెంకటరమణ, A3 శివ శంకర్ రెడ్డి, A4 రామకృష్ణారెడ్డి అనే నలుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. 

సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ 

జులైలో ఇలాంటి మోసం ఒకటి వెలుగుచూసింది. జీహెచ్ఎంసీలో సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ జరిగింది. గోషామహల్, మలక్పేట సర్కిళ్ల పరిధిలో చోటుచేసుకున్న ఈ స్కామ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు.  ఫెవికాల్, ఎంసీల్ మిక్స్ చేసి  కృత్రిమ వేలిముద్రలు తయారు చేసినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో చూసి ఆర్టిఫిషియల్ వేలిముద్రలు తయారుచేశారని తెలిపారు. ఫెవికాల్ లో ఎంసీల్ మిక్స్ చేసి సింథటిక్ లాంటి పదార్థాన్ని ఫీల్డ్ లోకి తీసుకువెళ్లి జీహెచ్ఎంసీలో పంచ్ చేశారని పోలీసులు గుర్తించారు.  

Also Read : Dumka Killing: దుంకా కిల్లింగ్ కేసులో నిందితుడిపై పోక్సో కేసు, విచారణ వేగవంతం అవ్వాలని సీఎం ఆదేశాలు

Also Read : కానిస్టేబుల్ ప్రకాశ్‌ కేసులో ట్విస్ట్ - ఎస్పీ సహా నలుగురిపై విచారణకు ఆదేశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget