అన్వేషించండి

Hyderabad News: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...

హైదరాబాద్ మణికొండలో రెండు రోజుల క్రితం డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడి మృతదేహాం సోమవారం లభ్యమైంది. డ్రైనేజీ కలిసే చెరువులో మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ మణికొండలో రెండు రోజుల క్రితం డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన రజినీకాంత్‌ అనే యువకుడు మృతదేహం సోమవారం లభ్యమైంది. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్‌ చెరువులో మృతదేహం లభ్యమైంది. మూడు కిలోమీటర్ల దూరంలో రజనీకాంత్‌ మృతదేహం కొట్టుకొచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. గోపిశెట్టి రజినీకాంత్‌ షాద్ నగర్​లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు పెరుగు ప్యాకెట్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రజినీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడిపోయారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్​బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది  రజనీకాంత్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ వెళ్లే మార్గంలో గాలించారు. 

Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

శనివారం రాత్రి ప్రమాదం

గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత గాలింపు కొనసాగించారు. నెక్నాంపూర్‌ చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగించగా రజినీకాంత్‌ మృతదేహాన్ని బయటపడింది. మణికొండలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. సెక్రటేరియట్‌ కాలనీ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్‌హోల్లోకి వరదనీరు చేరింది. రాత్రి 9.15గంటల సమయంలో కాలినడకన వెళ్తున్న రజనీకాంత్ ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. 

Also Watch: ఏపీలో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రహదారులు

అధికారుల నిర్లక్ష్యం

ఈ ప్రమాద దృశ్యాలు ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా అందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు, మణికొండ మున్సిపల్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకారంతో డ్రైనేజీ పొడవునా గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్‌ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌‌కు రెడ్ అలర్ట్! మరో 3 గంటల్లో అతి తీవ్రంగా వర్షం.. IMD ట్వీట్‌, హెచ్చరికలు

Also Read:  మణికొండలో గల్లంతైన వ్యక్తి ఎవరో తెలిసింది.. 12 గంటల నుంచి నాలాలు, చెరువుల్లో ఆయన కోసం గాలింపు

Also Read: బీడీ కోసం గొడవ.. ప్రత్యర్థిని చంపుదామని కత్తి తీసుకెళ్లిన వ్యక్తి, చివరికి ట్విస్ట్ మామూలుగా లేదు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget