అన్వేషించండి

Hyderabad News: భాగ్యనగరంలో భారీగా పెరిగిపోయిన సైబర్ నేరాలు - 15 మంది నిందితుల అరెస్ట్

Hyderabad News: హైదరాబాద్ లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈక్రమంలోనే నిందితులపై కన్నేసిన పోలీసులు మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. 

Hyderabad News: హైదరాబాద్ లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం నేరాలే కాదు, నేరగాళ్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. అమాయక ప్రజల పేరిట దొంగ రుణాలు తీసుకొని కొందరు, క్రెడిట్ కస్టమర్ కేర్ పేరుతో మరికొంత మంది మోసాలకు పాల్పడిన వారు. ఇలా రకరకాల పేర్లతో మోసాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్న 15 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి అమాయకుల పేరిట రూ.4.38 కోట్ల రుణాలు తీసుకున్న 10 మందిని తొలుత పోలీసులు అదుపులోకి తీసున్నారు. వీరంతా నకిలీ కంపెనీల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి, వారి డాక్యుమెంట్లతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు వచ్చిన తర్వాత వారిని ఉద్యోగాల నుంచి తీసేసి మళ్లీ కొత్త వాళ్లని రిక్రూట్ చేసుకున్నట్లు తేలింది. అలా కొత్తగా వచ్చిన వాళ్ల పేరిట మళ్లీ రుణాలు పొందడం షరా మామూలు. అయితే బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు.

క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ పేరుతో మోసాలు, ఐదుగురి అరెస్ట్!

ఎస్బీఐ క్రెడిక్ కార్డు కేర్ నంబర్ కోసం ఓ వ్యక్తి గూగుల్ లో వెతికాడు. ఈ క్రమంలోనే నకిలీ నంబర్ ను గుర్తించలేక దానికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ సిబ్బందిగా బాధితుడిని నమ్మించిన మోసగాళ్లు అతని మొబైల్ లో గుర్తించలేక దానికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ సిబ్బందిగా బధితుడిని నమ్మించిన మోసగాళ్లు అతని మొబైల్ లో ఎనీడెస్క్ యాప్ ను డౌన్ లోడ్ చేయించారు. అనంతరం బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.16 వేలు కాజేశారు. నష్టపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా దిల్లీకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిందితులపై కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ ముఠాగా ఏర్పడి నిందితులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. 

తక్కువ వడ్డీకే రుణాల పేరిట మరో మోసం 
ఇటీవలే కామారెడ్డి జిల్లాలో అమాయక, గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజలకు తక్కువ వడ్డీకి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇప్పిస్తామంటూ.. దంపతులు బురిడీ కొట్టించారు. బాధితుల కథనం ప్రకారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీహరి, రాణి అనే దంపతులు GDFC నిధి లిమిటెడ్ (పేదల పాలిట పెన్నిధి) అనే సంస్థ నుంచి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తామంటూ గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట తదితర మండలాలకు చెందిన  సుమారు 250 మంది అమాయక ప్రజల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు జీఎస్టీ, టాక్సీ, వివిధ పన్నుల రూపంలో సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.
 
దీంతో బాధితులు గత కొద్ది రోజుల నుంచి శ్రీహరి -రాణి కి ఫోన్లు చేశారు. ఫోన్ లో పొంతన లేని సమాధానం చెబుతూ.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెప్పారు. గత రెండు రోజుల నుంచి ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు శ్రీహరి స్వగ్రామమైన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ... తమకు అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తానంటూ దంపతులు నమ్మబలకడంతో వారి మాటలు నమ్మి ఒక్కొక్కరు రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు తమ వద్ద నుంచి వివిధ ట్యాక్సీ రూపంలో వసూలు చేసుకుని సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసి తమను మోసం చేశారంటూ వాపోతున్నారు బాధితులు. పోలీసులను ఆశ్రయించి తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీహరి, వాణిల కోసం వెతుకుతున్నారు.  అయితే సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Embed widget