అన్వేషించండి

Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

సరూర్ నగర్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడుపై 27 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 93.62 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన పాత నేరస్థుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు గఫార్ ఖాన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కేజీ 805 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,90,000 నగదు, ఒక బైక్, 10 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం రూ.93,62,500 విలువ గల సొత్తును  స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇప్పటికే 27 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు.Hyderabad Crime:  పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Also Read: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

పాత నేరస్థుడే మళ్లీ దొంగతనాలు

ఈ వివరాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సరూర్‌నగర్, సీసీఎస్ ఎల్‌బీ నగర్ పోలీసులు ఈ కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ మహేశ్ భగవత్ తెలియజేశారు. నిందితుడు గఫార్ ఖాన్ అలియాస్ జిగర్ పాత నేరస్థుడని తెలిపారు. గతంలో రాచకొండ, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. 2018లో మలక్‌పేట పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. 2019లో ఆదిబట్ల పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారన్నారు. అనంతరం జైలు నుంచి విడుదలయ్యాక 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ నేరాలకు పాల్పడినట్లు మహేశ్ భగత్ వెల్లడించారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను మరో నిందితుడు ఖాజా పాషాకి విక్రయించాడని తెలిపారు. ఈ డబ్బులను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో ఖర్చు చేసేవారని పోలీసులు తెలిపారు.

Also Read:  హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసాలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురానికి చెందిన నాగేశ్వరరావు అంబేడ్కర్‌ వర్సిటీ ఎదురుగా నెట్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆన్‌లైన్ సేవలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రి విక్రయించేవాడు. దీంతో స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. తాను ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నానని డబ్బులు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించాడు. తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో ఓ యాప్‌ రూపొందించాడు. ముందు వేల రూపాయల పెట్టుబడులను వసూలు చేసి అనుకున్న సమయానికి తిరిగి ఇచ్చేవాడు. దీంతో నాగేశ్వరరావుపై నమ్మకం ఏర్పడింది. ఇలా చాలా మంది లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అదును చూసి బోర్డు తిప్పేశాడు. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఊరి విడిచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు నాగేశ్వరరావు ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget