అన్వేషించండి

Hyderabad Crime News: టోలిచౌకీలో విషాదం - విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మృతి

Hyderabad Crime News: హైదరాబాద్ టోలిచౌకిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. 

Hyderabad Crime News: హైదరాబాద్ టోలిచౌకీ పారామౌంట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్మలు ఒకేసారి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారులంతా ఒకేసారి చనిపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. వారు ఏడుస్తున్న తీరు చూసి స్థానికులు కూడా కంట తడి పెట్టారు. 

అసలేం జరిగిందంటే..?

టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న 19 సంవత్సరాల అనస్, 18 సంవత్సరాల రిజ్వాన్, 16 సంవత్సరాల రజాక్ లు అన్నదమ్ములు. అయితే తమ ఇంట్లోని సంపు వద్ద మోటార్ ఆన్ చేసేందుకు అనస్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆయనకు కరెంట్ షాక్ తగిలింది. విషయం గుర్తించిన రిజ్వాన్ అన్నను కాపాడే ప్రయత్నం చేశాడు. కర్రతో కాకుండా చేతితో పట్టి లాగాలని చూశాడు. అదే తప్పైంది. అన్నను పట్టుకున్న తమ్ముడు రిజ్వాన్‌ కూడా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇంట్లోంచి అప్పుడే బయటకు వచ్చిన తమ్ముడు రజాక్.. అన్నలను చూశాడు. వెంటనే ఏమైందో చూద్దామని దగ్గరకి వెళ్లి వారిని పట్టుకున్నాడు. దీంతో అతడు కూడా విద్యాఘాతానికి గురయ్యాడు.

ఒకేచోట ముగ్గురు అన్నా తమ్ముళ్లు ప్రాణాలు కోల్పోయారు. చేతికి అంది వచ్చిన ముగ్గురు కొడుకులు.. ప్రాణాలు లేకుండా ఒకే చోట పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండెలు భాదుకుంటూ రోదిస్తున్నారు. తమను కూడా వెంట తీసుకెళ్లే బాగుండంటూ బావురుమంటున్నారు. వీరి స్థితి చూసిన స్థానికులు కూడా కంటతడి పెడుతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ఫిబ్రవరిలో నిర్మల్ లో కరెంట్ షాక్ తో బాలుడి మృతి

నిర్మల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరెంట్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఇంటి పెరటిలో కూరగాయల మొక్కల చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టారు. క్రికెట్ బంతి ఆ పెరటిలోకి వెళ్లడంతో అక్కడ పెట్టిన కరెంట్ తీగలు తగిలి బాలుడు మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ముదం ఈశ్వర్(11)  ఇంటి పెరటిలో పెట్టిన కరెంట్ తీగలు తగిలి మృతి చెందాడు. ఇంటి యజమాని విఠల్ పరారీల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.  

కూరగాయల మొక్కల చుట్టు పెట్టిన ఫెన్సింగ్ కు కరెంట్ పెట్టిన రైతులు

"నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుభాష్ నగర్ లో ఈశ్వర్ అనే బాలుడు క్రికెట్ ఆడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి పక్కింటి పెరటిలో పడింది. బంతి కోసం వెళ్లిన ఈశ్వర్ కూరగాయల మొక్కల చుట్టూ పెట్టిన ఫెన్సింగ్ కరెంట్ పెట్టారు. వీటిని ముట్టుకోవడంతో ఈశ్వర్ చనిపోయాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం." - ఖానాపూర్ సీఐ వినోద్    

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget