అన్వేషించండి

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Guntur Accident : గుంటూరు జిల్లాలో‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16వ  నెంబర్ జాతీయ రహదారి తుమ్మలపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న మొత్తం నలుగురు ఉండగా స్పాట్లో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మహిళకు  తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కారులో గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల‌ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

ఇంటి గోడ కూలి ఐదుగురు మృతి

ఛత్తీస్‌ గఢ్‌లోని కంకేర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఇంటి గోడ కూలి భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు మృతి చెదారు. ఐదుగురు మరణించినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. కాంకేర్ జిల్లాలోని పఖంజూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్పనార్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున ఇంటి మట్టి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు పడవలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకేర్‌లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని నదులు, వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

తల్లి, కుమారుడు మృతి

 చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, మామడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, కుమార్తె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరుకు చెందిన వెంకట్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.  ఆదివారం తమిళనాడు రాష్ట్రం వేలూరులోని స్నేహితుడిని కలిసి కుటుంబంతో సహా బెంగుళూరుకు తిరుగు ప్రయణం అయ్యారు. ఈ క్రమంలోనే గంగవరం మండలం, మామడుగు వద్ద జాతీయ రహదారిపై కారు ఎడమ వైపు ముందు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.

తల్లితో పాటు మూడేళ్ల కుమారుడి మృతి..!

ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న భార్య గాయత్రి(30), 3 సంవత్సరాలు కుమారుడు విథున్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. భర్త వెంకట్, కుమార్తె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులనుసరుక్షితంగా కారులోంచి బయటకు దింపారు. ఆ తర్వాత పోలీసులకు సమాచాంర అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గంగవరం ఎస్సై సుధాకర్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Who is Mallojula Venugopal Rao: తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు.. అన్న పిలుపుతో ఉద్యమ బాట
తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు.. అన్న పిలుపుతో ఉద్యమ బాట
Donald Trump Tariffs on India: భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
Crime News: ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
KTR : జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
Advertisement

వీడియోలు

Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Ind vs WI 2nd Test | బౌండరీ లైన్ దగ్గర బర్గర్ తింటూ కూర్చొన్న ఈ స్టార్ట్ బ్యాటర్ ఎవరో గుర్తుపట్టారా? | ABP Desam
Ind vs Wi Mohammad Siraj | విండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్‌కి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్ సిరీజ్ | ABP Desam
Harman Preet Kaur | వన్డే వరల్డ్ కప్ 2025లో హర్మన్ కెప్టెన్సీ, ఫామ్‌పై పెరుగుతున్న విమర్శలు | ABP Desam
Rohit Sharma vs Gautam Gambhir । రోహిత్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చిన గంభీర్ | AbBP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Who is Mallojula Venugopal Rao: తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు.. అన్న పిలుపుతో ఉద్యమ బాట
తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు.. అన్న పిలుపుతో ఉద్యమ బాట
Donald Trump Tariffs on India: భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
భారత్ పై ప్రభావం చూపని ట్రంప్ 50 శాతం టారిఫ్.. GDP వృద్ధి అంచనా పెంచిన IMF
Crime News: ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
KTR : జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్‌
Meesaala Pilla Song: ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Jaisalmer Bus Fire: జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
జైసల్మేర్ బస్సులో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి, DNA ద్వారా మృతదేహాల గుర్తింపు
Andhra Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక మలుపు-ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో SIT సోదాలు
Embed widget