అన్వేషించండి

Geetanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్

Tenali Woman Geetanjali Suicide: తెనాలిలో వివాహిత గీతాంజలిది ఆత్మహత్యేనని, అందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసభ్యకర పోస్టులు కారణమని గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు.

Geetanjali Suicide due to social media trolling: గుంటూరు: తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహిత మరణంపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ (Guntur SP Tushar Dudi) క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎస్పీ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. గీతాంజలి(32)ది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. మార్చి 7న ఉదయం 11 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం 5 మీదకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు గీతాంజలి ఎదురుగా వెళ్లగా, గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. కానీ ఆమె తలకు గాయం కావడంతో జీజీహెచ్ గుంటూరుకు అంబులెన్స్ లో తరలించారు. చికిత్స పొందుతూ మార్చి 11న 2 గంటలకు ఆమె చనిపోయింది. 

Geetanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్

గీతాంజలి ఆత్మహత్యకు కారణం ఇదే.. 
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, పోస్టింగ్స్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని రైల్వే పోలీసుల విచారణలో తేలిందని గుంటూరు ఎస్పీ తుషార్ వెల్లడించారు. తమకు అందిన సమాచారంతో అసహజ మరణంగా భావించి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రైల్వే ఎస్సై సరస్వతి ఈ కేసు విచారణ చేపట్టగా.. గీతాంజలి మార్చి 4న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇంటి పట్టా అందుకున్నారు. అదే సమయంలో తన సంతోషం వ్యక్తం చేస్తూ ఓ మీడియాతో మాట్లాడింది. ప్రభుత్వం నుంచి తనకు ఇళ్లు వచ్చిందని, జగనన్న అమ్మఒడి వస్తుందని, డబ్బులతో ఫిక్స్‌డ్ డిపాజిట్ సైతం చేశానని ఆమె చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులు, అసభ్యకరమైన పదజాలం వాడకం, దారుణమైన ట్రోలింగ్ కు గురైన ఆమె మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని గుంటూరు ఎస్పీ తుషార్ వివరించారు. ఆమె కుటుంబసభ్యులను సైతం దారుణమైన పదజాలంతో, కామెంట్లతో హింసించారని రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. 

Geetanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్

తెనాలి వన్ టౌన్ పీఎస్‌కు కేసు బదిలీ 
రైల్వే పోలీసులు గీతాంజలి మృతి కేసును తెనాలి వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని ఎస్పీ తుషార్ తెలిపారు. అక్కడ ఎఫ్ఐఆర్ అల్టర్ చేశామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు, వారు తెలిపిన సమాచారం మేరకు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. మహిళల భద్రతకు పోలీసులు ఎప్పుడూ కట్టుబడి ఉంటారని, వారిపై ఎలాంటి హింసకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. చిన్నారులు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. కానీ సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

డిజిటల్ పుట్ ప్రింట్స్, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఆమెపై అసభ్యకర పోస్టులు పెట్టిన కొన్ని ఒరిజినల్ సోషల్ మీడియా ఐడీలు, ఫేక్ ఐడీలను సైతం తాము గుర్తించామని తెలిపారు.  గీతాంజలిని వేధించిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సైబర్ వేధింపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, ఎవరికీ ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. గీతాంజలి చనిపోవడం బాధాకరం అన్నారు. ఆమెకు సంతానం తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పారు.

Also Read: గీతాంజలి ఫ్యామిలీకి భారీ పరిహారం, సీఎం జగన్ ప్రకటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget