అన్వేషించండి

Geetanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్

Tenali Woman Geetanjali Suicide: తెనాలిలో వివాహిత గీతాంజలిది ఆత్మహత్యేనని, అందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసభ్యకర పోస్టులు కారణమని గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు.

Geetanjali Suicide due to social media trolling: గుంటూరు: తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహిత మరణంపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ (Guntur SP Tushar Dudi) క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎస్పీ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. గీతాంజలి(32)ది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. మార్చి 7న ఉదయం 11 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం 5 మీదకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు గీతాంజలి ఎదురుగా వెళ్లగా, గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. కానీ ఆమె తలకు గాయం కావడంతో జీజీహెచ్ గుంటూరుకు అంబులెన్స్ లో తరలించారు. చికిత్స పొందుతూ మార్చి 11న 2 గంటలకు ఆమె చనిపోయింది. 

Geetanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్

గీతాంజలి ఆత్మహత్యకు కారణం ఇదే.. 
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, పోస్టింగ్స్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని రైల్వే పోలీసుల విచారణలో తేలిందని గుంటూరు ఎస్పీ తుషార్ వెల్లడించారు. తమకు అందిన సమాచారంతో అసహజ మరణంగా భావించి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రైల్వే ఎస్సై సరస్వతి ఈ కేసు విచారణ చేపట్టగా.. గీతాంజలి మార్చి 4న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇంటి పట్టా అందుకున్నారు. అదే సమయంలో తన సంతోషం వ్యక్తం చేస్తూ ఓ మీడియాతో మాట్లాడింది. ప్రభుత్వం నుంచి తనకు ఇళ్లు వచ్చిందని, జగనన్న అమ్మఒడి వస్తుందని, డబ్బులతో ఫిక్స్‌డ్ డిపాజిట్ సైతం చేశానని ఆమె చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులు, అసభ్యకరమైన పదజాలం వాడకం, దారుణమైన ట్రోలింగ్ కు గురైన ఆమె మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని గుంటూరు ఎస్పీ తుషార్ వివరించారు. ఆమె కుటుంబసభ్యులను సైతం దారుణమైన పదజాలంతో, కామెంట్లతో హింసించారని రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. 

Geetanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్యకు కారణాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ తుషార్

తెనాలి వన్ టౌన్ పీఎస్‌కు కేసు బదిలీ 
రైల్వే పోలీసులు గీతాంజలి మృతి కేసును తెనాలి వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని ఎస్పీ తుషార్ తెలిపారు. అక్కడ ఎఫ్ఐఆర్ అల్టర్ చేశామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు, వారు తెలిపిన సమాచారం మేరకు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. మహిళల భద్రతకు పోలీసులు ఎప్పుడూ కట్టుబడి ఉంటారని, వారిపై ఎలాంటి హింసకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. చిన్నారులు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. కానీ సైబర్ నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

డిజిటల్ పుట్ ప్రింట్స్, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఆమెపై అసభ్యకర పోస్టులు పెట్టిన కొన్ని ఒరిజినల్ సోషల్ మీడియా ఐడీలు, ఫేక్ ఐడీలను సైతం తాము గుర్తించామని తెలిపారు.  గీతాంజలిని వేధించిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సైబర్ వేధింపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, ఎవరికీ ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. గీతాంజలి చనిపోవడం బాధాకరం అన్నారు. ఆమెకు సంతానం తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పారు.

Also Read: గీతాంజలి ఫ్యామిలీకి భారీ పరిహారం, సీఎం జగన్ ప్రకటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
Embed widget