అన్వేషించండి

Hyderabad News: నగరంలో దారుణాలు - ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య, పెంచిన తల్లినే దారుణంగా చంపేసిన తనయుడు

Crime News: హైదరాబాద్ నగరంలో దారుణాలు జరిగాయి. ఓ చోట ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హతమార్చారు. మరో చోట పెంచిన తల్లినే ఓ వ్యక్తి మేకుతో పొడిచి చంపేశాడు.

Engineering Student Murder In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ బీటెక్ విద్యార్థిని అతని స్నేహితులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 వద్ద ప్రశాంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అతని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హతమార్చారు. మృతుడు ఎంవీఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఓ యువతి ప్రేమ విషయంలో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. 

నిందితులంతా ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, హత్యకు ప్రేమ వివాదం కారణమా.? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా.? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

పెంచిన తల్లినే మేకుతో పొడిచేశాడు

ఐదుగురు ఆడపిల్లలున్నా ఆ తల్లి కొడుకు కావాలని ఆశపడింది. బంధువుల వద్ద 2 నెలల బాబును దత్తత తీసుకుని కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా పెంచింది. అయితే, పెంచిన మమకారం మరిచిన ఆ కొడుకు పశువులా ప్రవర్తించాడు. ఆమెను మేకుతో పొడిచి చంపేశాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌లోని బస్తీకి చెందిన జయమ్మ (64), స్వామి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. అబ్బాయి కావాలని ఆశ పడ్డ ఆ దంపతులు ఇక తమకు అబ్బాయి పుట్టడని భావించి బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుని అతనికి వేణు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. జయమ్మకు పదేళ్ల తర్వాత ఓ బాబు పుట్టాడు. అయినా, ఇద్దరు పిల్లలనూ అదే మమకారంతో ఒకేలా చూసుకున్నారు. ఆరేళ్ల క్రితం వేణుకు పెళ్లి చేయగా.. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

మద్యానికి బానిసై..

కొంతకాలంగా వేణు మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని తీరు నచ్చక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డబ్బు కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఇటీవల అతనికి దాదాపు రూ.4 లక్షలు అవసరం అని బంధువులు తెలిపారు. బుధవారం రాత్రి బాగా తాగిన వేణు ఆ మత్తులోనే తల్లితో డబ్బుల కోసం మళ్లీ గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదు. కోపంతో ఊగిపోతూ ఓ పెద్ద మేకుతో ఆమె నుదిటిపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, జయమ్మ సొంత కొడుకు వినోద్ (24) మానసిక స్థితి సరిగా లేనట్లు తెలుస్తోంది. 18 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అయితే, వినోద్ అదృశ్యానికి వేణు కారణం కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
Raksha Gowda: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్
8 ఏళ్ల బాలికపై పాస్టర్ అమానుషం.. అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్లో రికార్డ్- అల్లూరి జిల్లాలో ఘటన
Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
World Cup Black Magic: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఒక ఆటగాడిపై క్షుద్రశక్తులు ప్రయోగించారా? ఇందులో వాస్తవం ఏంటి?
Embed widget