అన్వేషించండి

Hyderabad News: నగరంలో దారుణాలు - ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య, పెంచిన తల్లినే దారుణంగా చంపేసిన తనయుడు

Crime News: హైదరాబాద్ నగరంలో దారుణాలు జరిగాయి. ఓ చోట ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హతమార్చారు. మరో చోట పెంచిన తల్లినే ఓ వ్యక్తి మేకుతో పొడిచి చంపేశాడు.

Engineering Student Murder In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ బీటెక్ విద్యార్థిని అతని స్నేహితులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 వద్ద ప్రశాంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అతని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హతమార్చారు. మృతుడు ఎంవీఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఓ యువతి ప్రేమ విషయంలో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. 

నిందితులంతా ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, హత్యకు ప్రేమ వివాదం కారణమా.? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా.? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

పెంచిన తల్లినే మేకుతో పొడిచేశాడు

ఐదుగురు ఆడపిల్లలున్నా ఆ తల్లి కొడుకు కావాలని ఆశపడింది. బంధువుల వద్ద 2 నెలల బాబును దత్తత తీసుకుని కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా పెంచింది. అయితే, పెంచిన మమకారం మరిచిన ఆ కొడుకు పశువులా ప్రవర్తించాడు. ఆమెను మేకుతో పొడిచి చంపేశాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌లోని బస్తీకి చెందిన జయమ్మ (64), స్వామి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. అబ్బాయి కావాలని ఆశ పడ్డ ఆ దంపతులు ఇక తమకు అబ్బాయి పుట్టడని భావించి బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుని అతనికి వేణు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. జయమ్మకు పదేళ్ల తర్వాత ఓ బాబు పుట్టాడు. అయినా, ఇద్దరు పిల్లలనూ అదే మమకారంతో ఒకేలా చూసుకున్నారు. ఆరేళ్ల క్రితం వేణుకు పెళ్లి చేయగా.. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

మద్యానికి బానిసై..

కొంతకాలంగా వేణు మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని తీరు నచ్చక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డబ్బు కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఇటీవల అతనికి దాదాపు రూ.4 లక్షలు అవసరం అని బంధువులు తెలిపారు. బుధవారం రాత్రి బాగా తాగిన వేణు ఆ మత్తులోనే తల్లితో డబ్బుల కోసం మళ్లీ గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదు. కోపంతో ఊగిపోతూ ఓ పెద్ద మేకుతో ఆమె నుదిటిపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, జయమ్మ సొంత కొడుకు వినోద్ (24) మానసిక స్థితి సరిగా లేనట్లు తెలుస్తోంది. 18 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అయితే, వినోద్ అదృశ్యానికి వేణు కారణం కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Embed widget