అన్వేషించండి

Hyderabad News: నగరంలో దారుణాలు - ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య, పెంచిన తల్లినే దారుణంగా చంపేసిన తనయుడు

Crime News: హైదరాబాద్ నగరంలో దారుణాలు జరిగాయి. ఓ చోట ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హతమార్చారు. మరో చోట పెంచిన తల్లినే ఓ వ్యక్తి మేకుతో పొడిచి చంపేశాడు.

Engineering Student Murder In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ బీటెక్ విద్యార్థిని అతని స్నేహితులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 వద్ద ప్రశాంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అతని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హతమార్చారు. మృతుడు ఎంవీఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఓ యువతి ప్రేమ విషయంలో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. 

నిందితులంతా ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, హత్యకు ప్రేమ వివాదం కారణమా.? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా.? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

పెంచిన తల్లినే మేకుతో పొడిచేశాడు

ఐదుగురు ఆడపిల్లలున్నా ఆ తల్లి కొడుకు కావాలని ఆశపడింది. బంధువుల వద్ద 2 నెలల బాబును దత్తత తీసుకుని కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా పెంచింది. అయితే, పెంచిన మమకారం మరిచిన ఆ కొడుకు పశువులా ప్రవర్తించాడు. ఆమెను మేకుతో పొడిచి చంపేశాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌లోని బస్తీకి చెందిన జయమ్మ (64), స్వామి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. అబ్బాయి కావాలని ఆశ పడ్డ ఆ దంపతులు ఇక తమకు అబ్బాయి పుట్టడని భావించి బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుని అతనికి వేణు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. జయమ్మకు పదేళ్ల తర్వాత ఓ బాబు పుట్టాడు. అయినా, ఇద్దరు పిల్లలనూ అదే మమకారంతో ఒకేలా చూసుకున్నారు. ఆరేళ్ల క్రితం వేణుకు పెళ్లి చేయగా.. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

మద్యానికి బానిసై..

కొంతకాలంగా వేణు మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని తీరు నచ్చక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డబ్బు కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఇటీవల అతనికి దాదాపు రూ.4 లక్షలు అవసరం అని బంధువులు తెలిపారు. బుధవారం రాత్రి బాగా తాగిన వేణు ఆ మత్తులోనే తల్లితో డబ్బుల కోసం మళ్లీ గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదు. కోపంతో ఊగిపోతూ ఓ పెద్ద మేకుతో ఆమె నుదిటిపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, జయమ్మ సొంత కొడుకు వినోద్ (24) మానసిక స్థితి సరిగా లేనట్లు తెలుస్తోంది. 18 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అయితే, వినోద్ అదృశ్యానికి వేణు కారణం కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Two Headed Snake: 2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!
బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. కొత్తగా మరో సెక్షన్ చేర్చిన పోలీసులు.. దోషిగా తేలితే 10 ఏళ్ల జైలు!
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH In PlayOffs: ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..
ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..
Telangana Rains: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు
AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Peddi Trailer Review : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
Two Headed Snake: 2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?
Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?
Sanju Samson VS MS Dhoni: సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్
సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్
Embed widget