అన్వేషించండి

East Godavari News: ఫోన్ కావాలంటే ఈఎంఐలో ఇప్పించాడు, నెలనెలా కట్టమన్నందుకు దారుణమైన పని

East Godavari News: సెల్ ఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు లేవని, ఈఎంఐలో ఇప్పించమని స్నేహితుడిని కోరాడు. పాపం అని అతడు ఇప్పించగా.. నెలనెల వాయిదాల కట్టడం మానేశాడు. ఎందుకని నిలదీస్తే ప్రాణాలు తీసేశాడు.

East Godavari News: అతడి వద్ద సెల్ ఫోన్ లేదు. కొనుక్కునేందుకు డబ్బులు కూడా లేవు. ఈ క్రమంలోనే స్నేహితుడిని సాయం చేయమన్నాడు. క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ ఇప్పిస్తే నెలనెలా ఈఎంఐలు కడతానని చెప్పాడు. అందుకు ఒప్పుకొని ఫోన్ ఇప్పించాడు స్నేహితుడు. అదే అతని పాలిట శాపంగా మారింది. నెలా నెలా కడతానని చెప్పిన ఈఎంఐను కేవలం రెండు నెలలే సక్రమంగా కట్టాడు. ఆ తర్వాత నుంచి మానేశాడు. ఇదేంటని ఇంటికి వెళ్లి నిలదీసినందుకు ఇనుప రాడ్డుతో దాడి చేసి చంపేశాడు. ఆపై అతడి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టి తనకేం తెలియదని వివరించాడు. 

అసలేం జరిగిందంటే..? 
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం నడుపల్లికోట గ్రామానికి చెందిన మృతుడు కొడమంచిలి సురేంద్రకు స్నేహితుడు లాకవరపు పవన్ కుమార్. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే పవన్ కుమార్ ఫోన్ పాడవడంతో.. కొత్త ఫోను కొనుక్కోవాలనుకున్నాడు. కానీ అతడి వద్ద డబ్బులు లేవు. స్నేహితుడు సురేంద్ర వద్ద క్రెడిక్  కార్డు ఉందని తెల్సిన అతను.. ప్రతీ నెల ఈఎంఐ కట్టుకుంటాను ఫోన్ ఇప్పించమని కోరాడు. ఇందుకు ఒప్పుకున్న అతడు ఫోన్ ఇప్పించాడు. అయితే రెండు నెలల పాటు పవన్ కుమార్ ఈఎంఐ సరిగ్గానే కట్టాడు. కానీ మూడో నెల నుంచి కట్టడం మానేశాడు. ఇదే విషయం గురించి అడిగేందుకు సురేంద్ర ఇటీవల పవన్ కుమార్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన పవన్ కుమార్.. సురేంద్రపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

విషయం గుర్తించిన అతడు మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా కవర్ చేశాడు. కానీ మూడ్రోజుల తర్వాత నుంచి పవన్ కుమార్ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో... స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పవన్ కుమార్ ను గట్టిగా నిలదీయగా.. స్నేహితుడిని చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో తహసీల్దార్ సమక్షంలో తవ్వకాలు జరిపిన మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసారు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ వెంకటేశ్వర రావు తెలిపారు. వేగంగా కేసు దర్యాప్తు చేసిన ఎస్ఐ సూర్య భగవాన్ ను, సిబ్బందిని అభినందించారు. 

ఏడు నెలల క్రితం తెలంగాణలో ఇలాంటి ఘటనే.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం గాజులరాజం బస్తీకి చెందిన సందీప్‌ అలియాస్‌ బాబీ(23), అదే ప్రాంతానికి చెందిన జగడం సాయిలు చిన్ననాటి నుంచి మిత్రులు. అయితే ప్రతిరోజూ లాగే ఓరోజు వీరిద్దరూ కలిసి బస్తీలోని ఆర్కే సూపర్ మార్కెట్ పక్కన ఉన్న గల్లీలో సిగరేట్ తాగారు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. అయితే విచక్షణా జ్ఞానం కోల్పోయిన సాయి.. బాబీపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పిడి గుద్దులు గుద్దాడు. విషయం గుర్తించిన స్థానికులు అక్కడకు వచ్చి వారిని ఆపి వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వీళ్లు మాత్రం ఆగలేదు. జనాలు ఎక్కువయ్యే సరికి వారిద్దరూ కొట్టుకోవడం ఆపారు. అయితే అప్పటికే బాబీకి తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget