అన్వేషించండి

Delhi Rains: భారీ వర్షాలకు ఢిల్లీ రోడ్లు జలమయం, గుంతలో పడి ఆటో డ్రైవర్ మృతి

Delhi Rains: భారీ వర్షాలతో సతమతం అవుతున్న ఢిల్లీలో ఆటో డ్రైవర్ ఓ గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

Delhi Rains: 

డ్రైవర్ మృతి..

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. చాలా చోట్ల గుంతలు పడుతుండటం వల్ల వాహనదారులు నరకం చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గుంతల్ని మట్టి పోసి నింపుతున్నారు. అయినా వానలు కురవడం వల్ల ఆ మట్టి కొట్టుకుపోయి ప్రమాదాలకు దారి తీస్తోంది. హర్ష్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌ గుంతలో పడిపోయాడు. ఆటోలో వస్తుండగా గుంత కనిపించలేదు. ఉన్నట్టుండి ఆటో అందులో పడిపోయింది. అందులో నుంచి 51 ఏళ్ల డ్రైవర్ కూడా జారి పడ్డాడు. వాన నీటితో నిండిపోయిన ఆ గుంతలో పడిపోయాడు. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు గుంత తవ్వారు. పిల్లర్ ఇన్‌స్టాల్ చేసేందుకు దాన్ని అలాగే వదిలి పెట్టారు. ఇంతలో వర్షాలు కురవడం వల్ల మట్టి పోసి వదిలేశారు. రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ గుంత నిండిపోయింది. అది చూసుకోకుండా వెళ్లిన ఆటోడ్రైవర్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై PWD అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ స్పందించారు. 

"మధ్యాహ్నం 3.30 నిముషాలకు మాకు కాల్ వచ్చింది. వజీరాబాద్‌ రోడ్‌కి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్‌లో గుంతలో ఓ డ్రైవర్ పడిపోయాడని చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తవ్విన గుంత అది. ఆలోతు అంచనా వేయలేక  చిన్న గుంతే కదా అని నేరుగా అందులోకి వెళ్లిపోయాడు. ఆటో ఇరుక్కోగానే అందులో నుంచి బయటపడాలని చూశాడు. కానీ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. చాలా సేపటికి ఆయన డెడ్‌బాడీ బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యులెవరూ లేరు. పోస్ట్‌మార్టం ముగిశాక డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. దీనిపై విచారణ కొనసాగుతోంది"

- జాయ్ టిర్కీ, డీసీపీ 

ట్రాఫిక్‌కి అంతరాయం..

భారీ వర్షాల కారణంగా దేశ రాజధానిలో పరు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనిపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నగరంలో ఇంత జరుగుతున్నా ఆప్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోడం లేదని, ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే చూస్తూ ఉండిపోతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అలా వానలు పడ్డాయో లేదో అప్పుడే రోడ్లన్నీ జలమయం అయ్యాయని అసహనం వ్యక్తం చేస్తోంది. 

"ఢిల్లీ సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నీళ్లు వచ్చాయి. ఇక్కడ రోడ్లు కూడా జలమయం అయ్యాయి. ఓ ఆటోడ్రైవర్ అకారణంగా చనిపోయాడు. ఢిల్లీ ప్రజలంతా ఈ వార్తలు విని ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఢిల్లీ డ్రెయిన్‌లు శుభ్రం చేయడంలోనూ పెద్ద స్కామ్‌ జరిగిందన్న అనుమానాలున్నాయి. జనాల అవస్థలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులదే బాధ్యత. "

- బీజేపీ 

దాదాపు 2 దశాబ్దాల తరవాత ముంబయి, ఢిల్లీలో ఒకేసారి వానలు కురుస్తున్నాయి. అంతకు ముందు ఈ రెండు నగరాల్లోనూ బిపోర్‌జాయ్ ఎఫెక్ట్ కనిపించింది. ఆ తరవాత రుతుపవనాలు రావడంతో భారీ వర్షాలు కురవడం మొదలైంది. 

Also Read: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్ - సౌత్ ఈస్టర్న్ రైల్వే జీఎంపై బదిలీ వేటు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget