అన్వేషించండి

బతకనివ్వకుండా వేధింపులు - మరణించాకా అదే వ్యథ

నెల్లూరు జిల్లాలో కరుణాకర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, సురేశ్ రెడ్డి తన చావుకి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నాడు.

నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయాలకు ఓ దళిత యువకుడు బలయ్యాడు. స్థానిక రాజకీయ నాయకుల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలువురు రాజకీయ నాయకుల కారణంగానే తాను చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ అతడు రాసిన మరణ వాంగ్మూలం కలకలం రేపుతోంది. మరోవైపు.... దళితులు మరణించిన తర్వాత కూడా వివక్షకు గురవుతూనే ఉన్న పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి మరణిస్తే ఖననం చేయకుండా అడ్డుకున్నారు కొెెందరు వ్యక్తులు. ఏళ్లుగా ఇదే సమస్య ఎదురవుతున్నా అధికారులు పరిష్కారం చూపకపోవడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నా చావుకి వారే కారణం

నెల్లూరు జిల్లా కావలిలో ముసునూరు హరిజనపాలెంలో నివాసం ఉండే దుగ్గిరాల కరుణాకర్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, సురేశ్ రెడ్డి తన చావుకి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అతడు ఉరేసుకుని చనిపోయాడు. 20లక్షల రూపాయలు అప్పులు చేసి చెరువులో చేపలు పెంచితే, మూడేళ్లుగా వాటిని పట్టనివ్వడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి కూడా వైసీపీ నేతల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కరుణాకర్ సూసైడ్ లెటర్ రాసినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

శ్మశానవాటికపై వివాదం

సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తి మరణించిన తర్వాత ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం గురించి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి మండలం కొండూరు గ్రామంలో ఏళ్ల తరబడి దళితులు శ్మశాన వాటిక విషయంలో వివాదంతో ఇబ్బందులు పడుతున్నారు. దళితులు ఎవరైనా మరణిస్తే ఆ గ్రామంలో పోలీసుల సమక్షంలో ఖననం చేయాల్సిన దుస్థితి. అప్పటికి ఏదో తాత్కాలిక చర్యలు చేపట్టడం తప్ప స్మశాన వాటిక సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. 

ఖననం చేయనిచ్చేది లేదు

కొండూరు గ్రామంలో శుక్రవారం రాత్రి దళిత రామయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. శవాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్తుండగా అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి  చెందిన రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శ్మశాన వాటికలో 22 సెంట్ల భూమి తనదే అయినందున దళితులను ఖననం చేసేందుకు వీల్లేదని ఆయన భీష్మించారు. తరచూ ఇదే సమస్య ఎదురవుతున్నా ప్రభుత్వ అధికారులు సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలమయ్యారు. దళితులు ఎవరైనా చనిపోతే రెండు, మూడు రోజులు వారి కుటుంబ సభ్యులు ధర్నాలు, నిరసనలు తెలిపితే తప్ప ఖననం చేసేందుకు వీలు కలగడం లేదు. పోలీసులు, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారే తప్ప శాశ్వత ఏర్పాటు చేయడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొండూరు గ్రామంలో దళితులకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget