అన్వేషించండి

Cyber Crime: ఒక్కటి చెప్పనా బంగారం, పెట్టుబడి పెడితేనే కదా డబ్బులు వచ్చేదీ- సైబర్‌ నేరగాళ్ల టెంప్టింగ్‌ పోస్టులు

సైబర్‌ నేరగాళ్లు బంగారం మార్కెట్‌పై కన్నేశారు. పసిడిపై ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తున్నారు. గొల్డ్‌ ట్రేడింగ్‌ పేరుతో డబ్బు దోచుకుంటున్నారు.

రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ సాయంతో అమాయకులకు వల వేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. చదువు లేని వారు.. ఉన్నత స్థానంలో ఉన్నవారు  అని తేడా లేకుండా అందర్నీ మోసం చేస్తున్నారు. గతంలో ఇమెజేలు, లింకులు, ఫోన్‌ కాల్స్‌ రూపంలో డబ్బు దోచుకున్నారు. ఆ తర్వాత పార్ట్‌టైమ్‌ జాబ్స్‌, క్రిప్టో ట్రేడింగ్‌  పేరుతో ఛీటింగ్‌ చేశారు. ఇప్పుడు... కొత్త రూట్‌లో భారీ మోసాలను ప్లాన్‌ చేశారు. అత్యాశకుపోతున్న చాలా మంది అమాయకులు సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

బంగారం మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో నయా దందా మొదలుపెట్టారు సైబర్‌ నేరగాళ్లు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నారు. ఆ నెంబర్‌ నుంచి మెసేజ్‌లు పంపుతూ.. ఆకర్షిస్తున్నారు. అమ్మాయి ఫొటో చూడగానే... మెసేజ్‌ ఓపెన్‌ చేసి చూస్తారన్నది వారి ప్లాన్‌. మొదటి దశలో చాలా మంది వారి వలలో పడుతున్నారు. ఆ తర్వాత.. బంగారం మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారిని నమ్మించి ట్రాప్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం బంగారం మార్కెట్‌ ఫుల్‌ రేజ్‌లో ఉంది. పెట్టుబడి పెడితే లాభాలే తప్ప.. నష్టాలు ఉండవు. అందుకే చాలా మంది బంగారం మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఎలా పెట్టాలి... ఎవరిని సంప్రదించాలి అన్నది ఎక్కువ మంది తెలియదు. ఇదే అవకాశంగా మలుచుకున్నారు కేటుగాళ్లు. అలాంటి వారికి వల వేస్తున్నారు. బంగారం మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టండి అంటూ వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. పెట్టుబడులు పెడితే రోజుకు రూ.5 లక్షల వరకు సంపాదించవచ్చు.. అంటూ నమ్మిస్తున్నారు. వెతకబోయిన కాలి దగ్గరకే వచ్చిందని.. భావించేలా చేస్తున్నారు. కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోయారు... మోసపోతున్నారు.

గోల్డ్‌ ట్రేడింగ్‌పై చర్చించేందుకు వాట్సాప్‌ గ్రూప్‌లోకి రండి.. అంటూ మెసేజ్‌ ద్వారా ఆహ్వానిస్తున్నారు. నిజమని నమ్మిన చాలా మంది వాళ్ల ఉచ్చులో పడుతున్నారు. వాళ్లు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు. ట్రేడింగ్‌ కోసం డబ్బులు డిపాజిట్‌ చేయమంటే... చేస్తున్నారు. నేరగాళ్లు ముందు లాభాలు వచ్చినట్టు చూయించడంతో.. నమ్మిస్తున్నారు. నిజంగా లాభాలు వస్తున్నాయని నమ్మిన బాధితులు సంతోషంతో పొంగిపోతున్నారు. అత్యాశతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా కోట్లకు కోట్లు దోచేస్తోంది సైబర్‌ గ్యాంగ్‌

పెట్టుబడులు, వచ్చిన లాభాలను స్క్రీన్‌పై చూపిస్తున్న మోసగాళ్లు... వాటిని డ్రా చేసేందుకు మాత్రం అవకాశం కల్పించడంలేదు. డబ్బులు డ్రా చేసుకోవాలని బాధితులు కోరగా... పన్నుల పేరుతో మరింత డబ్బు కట్టాలంటూ మోసగిస్తున్నారు. బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు  లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో... బంగారం మార్కెట్‌ పేరుతో జరుగుతున్న మోసాలు బయటపడుతున్నాయి. 

బాధితుల నుంచి సేకరించిన డబ్బంతా క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు మోసగాళ్లు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు దృష్టిసారించారు. గోల్డ్‌ ట్రేడింగ్‌ పేరుతో మోసం చేస్ఉతన్న ముఠాలను అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. రాత్రి రాత్రి డబ్బు సంపాదించాలన్న అత్యాశే.. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడేలా చేస్తోందని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget