అన్వేషించండి

Chittor Crime News : క్లూ వదలకుండా దొంగతనం చేయడం వారి స్టైల్ - కానీ వారినీ పట్టేయడం చిత్తూరు పోలీసుల స్పెషాలిటీ !

ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ ఎవరికీ చిక్కని ముఠాను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున సొత్తు స్వాధీనం చేసుకున్నారు.


Chittor Crime News :   బ్యాంకులు, బంగారు నగల దుకాణాలు, పాన్ బ్రోకర్ దుకాణాలు,‌ఒంటరి ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చేందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను చిత్తూరు ‌పొలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి క్లూస్ దొరకకుండా  15 ఏళ్ళుగా దొంగతనాలకు పాల్పడుతూ 10 ఏళ్ళుగా పోలీసులకు చిక్కకుండా చత్తీస్‌గఢ్ లో స్ధావరం ఏర్పరుచుకుని నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ గ్యాంగ్.  ఒక్కటిన్నర నెలగా వివిధ రాష్ట్రాలను దర్యాప్తు సాగించి ఎట్టకేలకు ముఠా సంబంధి వివరాలను సేకరించి ముఠాలోఏ-1,ఏ-2 ప్రధాన నిందితులును పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి 55 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 3 కార్ల స్వాధీనం చేసుకున్నా చిత్తూరు పోలీసులు. 

ఏళ్లుగా ఎవరికీ చిక్కకుండా.. దొరకకుండా దొంగతనాలు !

చిత్తూరు జిల్లాలో  ఇటీవల గంగాధర నెల్లూరు పొలీసు స్టేషన్ ఫరిధిలో పాన్ బ్రోకర్ షాపులో  భారీ దొంగతనం జరిగింది.  ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గత ఒకటిన్నర నెల నుండి ఈ కేసు గురించి దక్షిణ భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.  శనివారం సాయంత్రం 3.00 గంటలకు ప్రత్యేక బృందానికి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు చిత్తూరు మండలం పరిధిలోని బెంగళూరు – తిరుపతి రోడ్డులోని చెర్లోపల్లి వద్ద  మురుగన్ శివగురు @ కరాటే మురుగా,  రాజాలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 లక్షల నగదు, 395 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 kg ల వెండి, నేరానికి ఉపయోగించిన 3 కార్లను మొత్తం 55 లక్షల విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. 

క్లూస్ దొరకకపోయినా నేరస్తుల్ని పట్టుకున్న చిత్తూరు పోలీసులు 

పట్టుబడి ముద్దాయిలను విచారించిన సమయంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ సహచర బృందంతో కలిసి గత 15 సంవత్సరాల నుండి దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, నగల షాపులు, ఒంటరి ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి భారి మొత్తాలను దోచుకొని జల్సా చేస్తూ పోలిసుల కళ్ళు గప్పి తప్పించుకొని తిరుగే వారని తేలిసిందని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రకటించారు.  ఈ ముఠా బృందంలోని సభ్యులు ఒకరిద్దరు అక్కడక్కడ అరెస్టు అవుతున్నప్పటికీ, గ్యాంగ్ లీడర్ లు అయిన A-1 M.మురుగన్ శివగురు @ కరాటే మురుగా, A-2 రాజా మాత్రం గత 10 సంవత్సారల నుండి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి పోలిసులకు కనిపించలేదన్నారు. తన స్థావరాన్ని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని, తన బృందంతో కలిసి నేరాలకు పాల్పడి తిరిగి ఛత్తీస్ ఘడ్ వెళ్లి తలదాచుకొనే వాడని,  ఈ ఇరువురుపై నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 42 కేసులు నమోదు అయి పెండింగ్ లో వున్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. 

గ్యాంగ్ లీడర్లు అరెస్ట్ మిగిలిన వారి కోసం గాలింపు 

చిత్తూరు జిల్లాలో కూడా గతంలో చిత్తూరు టౌన్, ఐరాల పొలిసు స్టేషన్ ఫరిదిలలో దొంగతనాలు చేసారని తెలిసిందన్నారు.. ఇద్దరు ముద్దాయిలు తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్‌పట్టు జిల్లా, వైపాన గ్రామంకు చేందిన‌వారుగా గుర్తించడం జరిగిందన్నారు.  ఈ‌ము ఠాలో తమిళనాడుకు చేందిన  మనికంట, నల్ల‌మురుగా, సెల్వరాజ్, పయని, వేంకటేష్, పేరుమాల్, కర్ణాటక రాష్ట్రంకు చేందిన సురేష్, పాండిచేరికి చేందిన రంజిత్ లను అరెస్టు చేయాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాంమని, త్వరలో వీరికి అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.  ఇక ఎటువంటి క్లూస్ లేని అత్యంత క్లిష్ట మైన ఈ కేసులో గత ఒకటిన్నర నెల నుండి దాదాపు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలన్ని తిరిగి సమాచారాన్ని సేకరించి ఎట్టకేలకు కేసును చేధించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget