అన్వేషించండి

Madanapalle Murder : తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని, నిద్రపోతున్న తండ్రిపై బ్లేడుతో దాడి!

Madanapalle Murder : కన్న తండ్రిని కుమారుడు బ్లేడ్ తో గొంతుకోసి హత్య చేశాడు. మద్యానికి బానిసైన తండ్రి రోజూ తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Madanapalle Murder : మద్యానికి బానిసైన తండ్రి రోజూ తల్లిని చిత్రహింసలకు గురిచేయడం చూసి భరించలేక కొడుకు తండ్రినే హత్య(Father Murder) చేశాడు.  తల్లిని చిత్రహింసలు పెడుతున్న తండ్రిని బ్లేడ్‌(Blade)తో గొంతుకోసి చంపాడు కుమారుడు. ఈ ఘటన శనివారం చిత్తూరు జిల్లా(Chittoor District) మదనపల్లె(Madanapalle)లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు(Tamil Nadu)లోని దేవికాపురానికి చెందిన కదిరేషన్‌, అతని భార్య మలార్‌కుడి మూడేళ్ల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతనికి కుమార్తె శ్రీమతి, కుమారుడు ఆదికేశవ్‌ ఉన్నారు. చేనేత పనిచేస్తూ కదిరేషన్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన కదిరేషన్ ప్రతి రోజు భార్యను హింసించేవాడు. తండ్రి తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని ఇంటర్‌ చదువుతున్న ఆదికేశవ్‌ చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న తండ్రి గొంతును బ్లేడ్‌తో కోసి ఆదికేశవ్ పరారయ్యాడు. శనివారం ఉదయం ఈ ఘటనను భార్య, కుమార్తె గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, వన్‌టౌన్‌ సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ లోకేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి సోదరుడు సెల్వకుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిని వేధించడం తట్టుకోలేక అతని కుమారుడు ఆదికేశవ్‌ ఈ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. 

తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఘాతుకం

తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ కొడుకు కన్న తండ్రినే హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారిమెరక గ్రామానికి చెందిన శేఖర్ బాబు ఉపాధి కోసం20 ఏళ్ల పాటు గల్ఫ్‌లో పనిచేసి మూడేళ్ల కిందట సొంత ఊరికి వచ్చాడు. ఆయన భార్య కూడా గల్ఫ్‌ నుంచి ఇటీవలే వచ్చారు. భార్య గల్ఫ్‌లో ఉన్న సమయంలో శేఖర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు శరత్ బైక్ కొనుక్కునేందుకు తండ్రిని డబ్బులు అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని శేఖర్ చెప్పాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న కుమారుడు ఆస్తులన్నీ అమ్మేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఇస్తున్నాడని, తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. దీంతో ఈ నెల 6వ తేదీన తనతో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చదువుతున్న ఆరుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కాళ్లు, చేతులు కట్టేసి ఇనుపరాడ్డుతో దాడి చేశారు. తలపై తీవ్రంగా కొట్టడంతో శేఖర్ మృతి చెందాడు. బంధువులు వచ్చే సరికి తండ్రి ప్రమాదవశాత్తు పడిపోయాడని నమ్మించి రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఆస్పత్రికి వచ్చేసరికి శేఖర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కొడుకు మీద అనుమానంతో ప్రశ్నించగా తానే తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. కాళ్లు, చేతులు విరగ్గొడదామనుకుంటే ప్రమాదవశాత్తు చనిపోయాడని శరత్ పోలీసులకు చెప్పాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం

వీడియోలు

World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget